అఖండ 2 హిట్ అవ్వాలని బోయపాటి అలాంటి పని.. ఇండస్ట్రీ ప్రముఖులు షాక్..!
డిసెంబర్ 5వ తేదీకి రిలీజ్ కావాల్సిన సినిమాను కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న వార్తలు భగ్గుమన్నాయి. కానీ ఇప్పుడు అన్ని అవాంతరాలు తొలగిపోయి, ‘అఖండ 2’ రిలీజ్ అవ్వడానికి పూర్తిగా సెట్ అయింది. అయితే మరిన్ని సమస్యలు రాకుండా ఉండేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని, అదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.అవాంతరాలు లేకుండా, సినిమా బ్లాక్బస్టర్ అవ్వాలని కోరుకుంటూ, బోయపాటి శ్రీను పూర్తి 24 గంటల పాటు కటిక ఉపవాసం ఉండబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా కేవలం ఉపవాసమే కాదు – ఒక చుక్క నీళ్లూ తాకకుండా, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నారట. ఇప్పటివరకు బోయపాటి తన ఏ సినిమాకైనా ఇలాంటి ఆధ్యాత్మిక దీక్ష తీసుకోలేదని, ఇది ‘అఖండ’ సినిమా పట్ల ఆయనకు ఉన్న ప్రత్యేకమైన భావోద్వేగం, అంకితభావాన్ని చూపుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అయ్యేంతగా స్పందిస్తున్నారు. "బోయపాటి ఇంత వరకు ఎప్పుడు ఇలా చేయలేదు… అంటే ఈ సినిమా ఆయనకు ఎంత ప్రాముఖ్యత కలిగివుంటుందో అర్థమవుతుంది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. దీని పై అధికారిక ప్రకటన ఇప్పటికీ రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తుఫానులా వైరల్ అవుతోంది.మొత్తానికి, ‘అక్కడ’ సినిమా రిలీజ్కి ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ, దాని చుట్టూ క్రియేట్ అవుతున్న హడావిడి మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టే ప్రాజెక్ట్ రాబోతుందనే సంకేతాలు ఇస్తోంది.