బ్యాంకుల ముందు చెత్త కుప్పలు వేసిన ప్రజలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుని పలు రకాల పథకాలను కూడా ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. కేవలం పథకాలను ప్రవేశపెట్టడమే కాదు ఆ పథకాలు అన్ని ప్రజలకు చేరే విధంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్  కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ ప్రజలకు వివిధ రకాల పథకాల ప్రవేశపెట్టినప్పటికీ రుణాలు మంజూరు చేసినప్పటికీ బ్యాంకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి



 ప్రస్తుతం పలు బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . దేవుడు వరమిచ్చినప్పటికీ పూజారి పర్మిషన్ ఇవ్వలేదు అన్న చందంగా మారిపోయింది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు. రాష్ట్ర ప్రభుత్వం పేదల అందరికీ మేలు జరిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతుంది. కానీ  అటు బ్యాంకులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఎంతో మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇలాంటి క్రమంలోనే ఇటీవల  ప్రజలు వినూత్నంగా ఆలోచించి బ్యాంకు అధికారులకు భారీ షాక్ ఇచ్చారు.


 కృష్ణా జిల్లా ఉయ్యూరు లో మూడు బ్యాంకుల ముందు చెత్త పోయడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది. నగర పంచాయతీ కమిషనర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రజలు ఆయా బ్యాంకుల ముందు చెత్తపోశారు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చే బ్యాంకు సిబ్బంది వచ్చేసరికి బ్యాంకు ముందు చెత్త చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రభుత్వం ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ నిధి, జగనన్న తోడు, వైయస్సార్ చేయూత పథకాలకు సంబంధించిన లోన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీంతో అటు ప్రతిపక్షాలు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: