10వేల మంది రోగులకు 5 బెడ్లు.. ఎనిమిది మంది డాక్టర్లు..?
ముఖ్యంగా ఈ 2020 సంవత్సరం లో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఎంతోమంది ప్రస్తుతం ఆసుపత్రి పాలైన నేపథ్యంలో వైద్యుల కొరత మరింత తీవ్రం గా మారిపోయింది అంతేకాకుండా ఆసుపత్రుల్లో వైద్యసేవల కొరత కూడా తీవ్రంగా మారిపోవడంతో ప్రజలు ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక ఇటీవలే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో భాగంగా భారత దేశంలో వైద్య సేవల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అన్నది బయటపడింది. ఇక ఇటీవలే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2020 లో భాగంగా భారతదేశం వైద్యసేవలు అందించడంలో దారుణ స్థితిలో ఉంది. ఏకంగా 155 వ స్థానంలో ఉంది.
అయితే ఈ నివేదికలో భారత్ తర్వాత... ఉగాండా నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి 12 దేశాలు మాత్రమే ఉండటం గమనార్హం. అంతేకాకుండా భారతదేశంలో పదివేల మంది రోగులకు గాను కేవలం 8.6 మంది వైద్యులు మాత్రమే ప్రస్తుతం ఉండగా.. ఇక బెడ్ ల సంఖ్య కేవలం 5 మాత్రమే ఉండడం భారత దేశంలో వైద్య పరిమాణాలు ఎంత దీన స్థితిలో ఉన్నాయో అని చెప్పకనే చెబుతున్నాయి. అయితే భారతదేశంలో సగటు మనిషి ఆయుర్దాయం 69.7 సంవత్సరాలు ఉండగా ఆఫ్ఘనిస్తాన్ లో 72.6 శాతంగా ఉంది.