మేం సిద్ధంగా ఉన్నాం.. స్కూళ్లు ప్రారంభించండి సారూ.. కేసిఆర్ కి లేఖ..?
ప్రస్తుతం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ విద్యాసంస్థలను తెరిచింది ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ విద్యాసంస్థలను పునఃప్రారంభం పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణలో వరుసగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో... విద్యాసంస్థల ప్రారంభం పై దృష్టి సారించడం లేదు ప్రభుత్వం. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు విద్యాసంస్థలను తెరుస్తారు అన్న దానిపై పూర్తి స్థాయిలో క్లారిటీ లేకుండా పోయింది ఈ క్రమంలోనే అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి లేఖ రాసారు. రాష్ట్రప్రభుత్వం స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకుంటే తాము విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ లేఖలో పేర్కొన్నారు. కనీసం తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని కోరారు తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చంద్రప్రకాష్. స్కూళ్లు ప్రారంభించడంతో పాటు కరోనా వైరస్ నిబంధనలకు అనుగుణంగా స్కూళ్లను శానిటేషన్ చేయడంతోపాటు మాస్కులు తప్పనిసరిగా అందించాలి అంటూ కోరారు.