గ్రేటర్ యుద్దం : వార్ ముగిసింది..మరి గెలుపేవారిది ..??
మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లు మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ ప్రకటించింది.అయితే చిన్న పొరపాటు వల్ల ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.అక్కడ 3 తేదీన రీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది.ఆ తర్వాత పూర్తి స్థాయి పోలింగ్ వివరాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. కాగా, కొన్ని డివిజన్లలో కనీసం 25 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదని తెలుస్తోంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది.మరి ఈ సారి అంతా కంటే తక్కువనే మొదలయ్యే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదిలా వుంచితే బల్దియా పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగింది. భాజపా అగ్ర నేతలు సైతం హైదరాబాద్ నగరానికి వచ్చి ప్రచారం హోరెత్తించడంతో రాజకీయం మరింతగా హీటెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో కనీసం ఈసారైనా పోలింగ్ 50శాతం దాటుతుందని అందరూ ఆశించినా.. గత రెండు ఎన్నికల కన్నా తక్కువ పోలింగ్ నమోదు కావడం గమనార్హం.మరి బల్దియా పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో చూడాలి.