
గ్రేటర్ యుద్ధం : సర్వం సిద్ధమైంది..?
ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల కోసం పోలింగ్ నిర్వహణను చూసుకునేందుకు 48 వేల మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. గ్రేటర్ పరిధిలో 36 డిఆర్సి కేంద్రాలు ఉండగా.. ఆయా కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ సిబ్బంది కి ఈరోజు పోలింగ్ సామాగ్రిని అందించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లకు మించి ఉండకుండా ఉండేలా ప్రస్తుతం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది ఎన్నికల సంఘం. అదే సమయంలో కరోనా వైరస్ బాధితులకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
అయితే ఇన్ని రోజుల వరకు ముమ్మర ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. గ్రేటర్ పరిధిలోని ఓటర్లు కూడా సరైన అభ్యర్థులను ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీ ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇన్ని రోజుల వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రచారం చేపట్టిన అభ్యర్థులందరూ లో కూడా ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.