బీజేపీ గేమ్ స్టార్ట్: కోర్ట్ మెట్లెక్కిన దుబ్బాక ఎమ్మెల్యే...?

VAMSI
హైకోర్టును ఆశ్రయించారు దుబ్బాక ఎమ్మెల్యే..... నాకు న్యాయం చేయాలంటూ కోర్టు తలుపు తట్టిన ఎమ్మెల్యే పలు అంశాలను పరిగణలోకి తీసుకొని తనకి న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన మరెవరో కాదు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈయన తాజాగా తెలంగాణలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి తొలిసారి ఓటమిని రుచి చూపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించడం రాజకీయ రంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. కోర్టును ఆశ్రయించిన ఈయన సిద్దిపేటలో నమోదైన ఎఫ్ ఐ ఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రూ.18 లక్షలు దొరికాయంటూ కుట్రలు చేశారని... అవి కట్టు కథలు తప్ప అందులో ఏ మాత్రం నిజం లేదని రఘునందన్ రావు పిటిషన్ లో పొందుపరిచారు.

ఎమ్మెల్యే రఘనందన్ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు రాగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సూచించారు. రఘునందన్ రావు పిటిషన్ దాఖలు లను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. అయితే ఈ కేసు విచారణను ప్రధాన న్యాయపూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలలో రఘునందన్ రావు మామ అంజన్ రావు ఇంట్లో సోదా చేయడం జరిగింది. అంజన్ రావు ఇంట్లో రూ.18.67 లక్షలు పట్టుబడ్డాయని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.

రఘునందన్ అనుచరులు రూ.12.80 లక్షలు ఎత్తుకెళ్లారని తెలిపారు. 30 మందిని గుర్తించామని వారిపై కేసులు నమోదు చేస్తామని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని బీజేపీ శ్రేణులు ఆరోపించగా.. ఆ డబ్బంతా రఘునందన్ రావుదే అని టీఆర్ ఎస్ ప్రచారం చేసింది. కాగా కట్టు కథలు అల్లి తనపై ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు రఘునందన్ రావు. ఇప్పుడు ఈ కేసులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: