ఒక్క మాటలో భారీ నష్టం....ఓటమి అంచున ట్రంప్ ?
భారత్ ని గతంలో చాలా సార్లు ట్రంప్ విమర్శించినా కూడా తాజాగా ఆయన మాటలు మాత్రం దారుణమనే చెప్పాలి. మురికి దేశం అంటూ నోరు పారేసుకున్న ట్రంప్ అందుకు తగిన ప్రతిఫలాన్ని తొందరలొనే చవిచూస్తారని అంటున్నారు. ఇక ఒక్క ఓటు కూడా ప్రవాస భారతీయుల నుంచి ట్రంప్ పొందలేరని కూడా అంటున్నారు. అసలు ట్రంప్ కి భారత్ మీద ఎందుకు ఇంత అక్కసు అసహనం వచ్చింది అన్నదే ఇక్కడ ప్రశ్న.
ఆ మధ్యన కూడా ట్రంప్ భారత్ మీద గట్టిగానే విరుచుకుపడ్డాడు. కరోనా లెక్కలు చెప్పడంలో భారత్ ప్రపంచాన్ని మోసం చేస్తోందని కూడా ట్రంప్ ఆరోపించిన సంగతి విధితమే. తాజా డిబేట్ లో ట్రంప్ మరో మాట అన్నారు, ఇది భారత్ ని గుచ్చేసేదే. భారత్ చైనా, రష్యాలతో కలిపి ఒకే గాటన కట్టిన ట్రంప్ ఈ దేశాలనీ పర్యావరణానికి తీరని హాని చేస్తున్నాయని నిందించారు. ఈ క్రమంలో ఆయన మరింతగా నోరు చేసుకుని మురికి దేశం అంటూ ఘాటైన పదజాలం వాడారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ట్రంప్ ఓటమి అంచున ఉన్నాడని అంతా చెప్పేస్తున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకునేందుకు కూడా ఆయన ఏమీ ఆశలు మిగుల్చుకోలేదని కూడా అంటున్నారు. ఇక ట్రంప్ పని అయిపోయిందని అంతర్జాతీయ విశ్లేషకులు కూడా తేల్చేస్తున్నారుట. మొత్తానికి నోరా పదవికి చేటే అన్న మాటను ట్రంప్ ను చూసే నేర్చుకోవాలేమో.