వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు బ్రేక్ ...కారణాలివే...?
కొన్ని కారణాలవలన మొదటి విడత విచారణ ఆగింది. తరువాత మళ్ళీ రీసెంటుగా కేంద్రం నుండి వచ్చిన సిబిఐ బృందం విచారణను వేగవంతం చేసింది. అయితే ఈసారి కరోనా వైరస్ కారణంగా విచారణ ఆగేలాగా ఉందని మీడియా వారు అనుకుంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది. అయితే కరోనా లక్షణాలు కనిపించిన మరో అధికారి కూడా పరీక్ష చేయించుకున్నారు. అయితే, ఆ అధికారికి కోవిడ్ నెగటివ్ అని తేలింది. దీంతో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన సీబీఐ అధికారి వ్యక్తిగత ఐసోలేషన్కు వెళ్లారు. దీనితో మిగతా అధికారులకు కూడా కోవిడ్ భయం పట్టుకుంది. కోవిడ్ సోకిన సిబిఐ అధికారి విచారణలో భాగంగా విచారణకు హాజరైన అనుమానితులు కూడా కోవిడ్ బారిన పడే అవకాశం లేకపోలేదు. కాగా ఒక్క వ్యక్తితో కరోనా ఆగిపోతే విచారణ సజావుగా సాగుతుంది. లేదంటే ఈ బృందంలో మిగతా వారికి కూడా కరోనా పాజిటివ్ గా తేలితే వివేకా హత్య కేసు విచారణ మరో సారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మరి ఏమీజరగనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వ్యవధి పట్టేలా ఉంది.