అత్యాచార బాధితురాలికి గర్భం.. దీంతో ఏం చేసిందో తెలుసా..?

praveen
ఈ మధ్యకాలం లో కామందుల బారిన పడి ఎంతో మంది మహిళల జీవితం అగమ్యగోచరం  గా మారిపోతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ యువతి జీవితం ఇలాగే అయిపోయింది. కామందుల బారిన పడి అత్యాచారానికి గురైన యువతి చివరికి గర్భం దాల్చింది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకో లేక ఉంచుకోలేక ఎంతగానో వేదన అనుభవించింది  యువతి. పెళ్లి కాకుండా నే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కఠిన నిర్ణయం తీసుకొని 10 రోజులకే పేగు బంధాన్ని తెంచుకుంది  సదరు యువతి. చివరికి పేగు తెంచుకుని పుట్టిన శిశువుని అంగట్లో అమ్మకానికి పెట్టేసింది.

 అత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల విచారణ లో ఈ షాకింగ్ విషయం తెలియడంతో.. బాధితురాలి తల్లిదండ్రులు పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన యువతి అత్యాచారానికి గురైంది. అప్పుడు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ రేపిస్టు కారణంగా యువతి అవాంఛిత గర్భం దాల్చింది. చివరికి ఈ నెల 12వ తేదీన ఆ యువతి బిడ్డకు జన్మనిచ్చింది.

పెళ్లికాని కూతురికి బిడ్డ పుట్టిందని అవమానంగా భావించిన తల్లిదండ్రులు పేగు బంధాన్ని తెంచేసారు.. పేగు తెంచుకుని పుట్టిన బంధాన్ని మరవలేక  బాధితురాలు వద్దు అని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు ఎలాగోలా సదరు బాధితురాలిని ఒప్పించి బిడ్డను అమ్మేసారు.  ఏకంగా  60 వేలకు ఆ పసికూనను విక్రయించారు. అయితే అత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు డి ఎన్ ఎ పరీక్షలకోసం పాపను  తేవాలని అడగడంతో.. పాప పురిట్లోనే చనిపోయిందంటూ డ్రామా మొదలుపెట్టారు. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపడంతో  అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: