దారుణం : తల్లి లాంటి దాన్ని అంటూ పరిచయం చేసుకుంది.. చివరికి ఆ బాలికను..?

praveen
పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అనుబంధాల పేరుతో... మాయమాటలు చెప్పి చివరికి చిన్న పిల్లల జీవితాలను... నాశనం చేస్తున్నారు ఎంతోమందిని. మాటలు చెప్పి చిన్నారి బాలికను నమ్మించి ఏకంగా వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఘటనలు ఈ రోజుల్లో చాలానే తెరమీదికి వస్తున్నాయి. తాజాగా ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న పిల్లలను టార్గెట్ గా  చేసుకొని.., మంచి భవిష్యత్తు ఉంటుందని మాయమాటలు చెప్పి చివరికి వ్యభిచారంలోకి దింపి వారి బ్రతుకు చింద్రం  చేస్తున్నారు.

 తాజాగా ఇలాంటి ఒక వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇక విచారణలో తేలిన విషయాలు పోలీస్ లను సైతం విస్మయం కలిగించాయి. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారి వద్దకు వెళ్లి మీ కూతురు అని మేము పెంచుకుంటామని... చదివిస్తాము.. అమ్మలా  చూసుకుంటాము..  అంటూ  మాటలు చెబుతున్నారు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని తల్లిదండ్రులు వారికీ పిల్లలను అప్ప  చెప్తున్నారు. కానీ అమ్మలా చూసుకుంటాను అంటూ తీసుకెళ్ళేవారు చివరికి వారిని వ్యభిచారంలోకి దిగుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో.. వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసి  ఓ బాలికను దాదాపు ఐదేళ్ల తర్వాత తన మేనమామ దగ్గరకు చేర్చారు పోలీసులు.

 వివరాల్లోకి వెళితే.. ఏదో మాయ మాటలు చెప్పి మహిళ అపార్ట్మెంట్ లో అద్దెకు దిగుతుంది.. ఇక ఇతరుల వద్ద మాయమాటలు చెప్పి తెచ్చుకున్న పిల్లలను ఆ అపార్ట్మెంట్ లో ఉంచుతుంది.. ఇంకేముంది వ్యభిచారానికి తెరలేపుతుంది. . మహిళా ఖాతాల్లో గూగుల్ పే ఫోన్ పే ద్వారా విటులు  డబ్బులు జమ చేస్తారు. సదరు  శుభం తెలియని బాలికలను వారికీ  విక్రయించి సొమ్ము చేసుకుంటుంది మహిళా. మళ్లీ మాయమాటలతో కొంత మంది బాలికలను తీసుకువచ్చి  ఇదే పని చేస్తుంది. ఇక ఎవరికీ  అనుమానం రాకుండా అపార్ట్మెంట్ మారుస్తు  ఉంటుంది. ఇలాంటి సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: