మత్తుమంది ఇచ్చి నగ్న ఫొటోలతో అత్యాచారం... కృష్ణా జిల్లాలో కీచక పాస్టర్
భక్తులకు ప్రచవనాలు బోధించాల్సిన పాస్టర్ కామాంధుడిగా మారాడు. ప్రచవనాలు మానేసి ఓ భక్తురాలిపై కన్నేసి ఆమెను లోబరుచుకున్నాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి నగ్న వీడియోలు తీయడంతో పాటు వాటి ద్వారా ఆమెను బెదిరించి మరీ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వెలుగుచూసింది. చిలకలపూడికి చెందిన రాచర్ల జోయెల్ రాజుపేటలోని ఇమ్మానియేల్ గాస్పెల్ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. అక్కడే రాజుపేటకు చెందిన ఓ వివాహిత తరచూ జోయేల్ చర్చికి ప్రార్థనలకు వచ్చేది. ఆమెతో పరిచయం పెంచుకున్న కీచక ఫాస్టర్ ప్రత్యేక ప్రార్థనల పేరిట గత అక్టోబర్లో ఆమెను చర్చికి రప్పించుకున్నాడు.
ఆ తర్వాత ఆమెకు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో ఆమె స్పృహ తప్పింది. వెంటనే ఆమె నగ్న ఫొటోలు తీసి వాటి ద్వారా ఆమెను బెదిరిస్తూ కోరిక తీర్చాలన్నాడు. పరువు పోతుందని భావించిన బాధితురాలు అతడికి లొంగిపోయింది.దీంతో పాస్టర్ జోయెల్ తరుచూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. చర్చిలో ప్రార్థనలు ముగిశాక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఇటీవల తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో భర్త నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఆమె భర్త కీచక పాస్టర్పై ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాస్టర్ తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు అతడిపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.