లాక్డౌన్ కొనసాగించాలా... వద్దా..? ఈరోజే నిర్ణయం తీసుకోనున్న మోడీ!
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ డెడ్లైన్ దగ్గరపడుతోంది. ఏప్రిల్ 14తేదీకి ఇంకా ఏడు రోజులే మిగిలి ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం అమాంతంగా పెరుగుతోంది. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా 4218 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 127మంది మృతి చెందారు. ఇక వచ్చే వారం రోజుల్లోనే కేసుల సంఖ్య తగ్గే అవకాశం మాత్రం అస్సలు కనిపించడం లేదు. మరింతగా పెరగడం ఖాయమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీల్లో మరింత వేగం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటోంది. ప్రస్తుతం రోజుకు పదివేల పరీక్షలు చేస్తున్నారు. వచ్చే రెండుమూడు రోజల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేయడానికి అవసరమైన పరికరాలను సమకూర్చుతున్నారు అధికారులు. పరీక్షల్లో వేగం పెంచితే.. సకాలంలో బాధితులకు చికిత్స అందించవచ్చునని, అప్పుడే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని వైద్యవర్గాలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా {{RelevantDataTitle}}