హింసను ప్రేరేపించేవారిని ఎట్టిప్రోత్సహించొద్దు..ఉపరాష్ట్రపతి చురక
అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని కలాం యువతలో చూశారని.. అందుకే భవ్యమైన భారత నిర్మాణానికి యువతను చైతన్య పరిచేందుకు అవకాశం ఉన్న ఏ సందర్భాన్ని ఆయన వదల్లేదన్నారు. కలాం పుస్తకాలను చదువుతూ తాను ఉద్వేగానికి గురైన సందర్భాలు అనేకమున్నాయని ఈ సందర్భంగా ఉపరాష్ర్లపతి పేర్కొన్నారు. తరగతి గదుల్లో, ఇంటి గోడలపై ఇలాంటి మహనీయుల సూక్తులు రాసుకోవడంతోనే సరిపోదని.. ఆ సూక్తుల్లోని భావాలను అర్థం చేసుకుని ఆచరించాలని చిన్నారులకు ఉపరాష్ర్ పతి సూచించారు. చిన్నతనం నుంచే మంచి పుస్తకాలను చదవడాన్ని అలవాటుచేసుకోవాలని.. దేశనాయకులు, కలాం వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను చదివి ప్రేరణ పొందాలని. వీటిని నిజ జీవితంలో అమలుచేయడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చన్నారు. చదువును ఓ ఉద్యాగాన్నిచ్చే అవకాశంగా మాత్రమే చూడొద్దని।। చదువు అనేది వివేకం, విజ్ఞానం, స్వావలంబన, సాధికారతను పెంచేదిగా అర్థం చేసుకోవాలన్నారు.
ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో హింసకు తావు లేదని.. హింసను ప్రేరేపించే ఏ విషయానికీ మద్దతు ఇవ్వొద్దని ఆయన యువతకు సూచించారు. మతోన్మాదాన్ని ప్రోత్సహించే వారు సెక్యులరిజం అనే పదాన్ని అడ్డు పెట్టుకుని, ఇతరులపై దాడి చేస్తూ ఉంటారని.. అలాంటి ప్రయత్నాలను ఖండించాలన్నారు. తప్పుడు పనులు చేస్తున్నవారిని సమర్థించడం జాతివ్యతిరేక చర్య అవుతుందన్నారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే శాంతియుత వాతావరణం నెలకొనడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. 2050 నాటికి ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తిగా అవతరించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని.. ఈ పరిస్థితుల్లో ఇందుకు అనుగుణమైన నైపుణ్యాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడం, వినూత్న పరిష్కారాలు కనుగొనడం, సమస్యలకు సమాధానాలు కనిపెట్టే ప్రయత్నం చేయడం యువత లక్ష్యం కావాలన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన పరంపరను మనం పరిరక్షించుకోవాలని.. దీని ద్వారా సాటి జీవుల పట్ల ప్రేమ, సమస్త విశ్వం పట్ల స్నేహభావం పరిఢవిల్లుతాయని చిన్నారులకు ఉపరాష్ర్దపతి మార్గదర్శనం చేశారు. కలాం చూపిన బాటలో నడుస్తూ.. వారు కలలుగన్న అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో చిత్తశుద్ధి, క్రమశిక్షణతో భాగస్వాములు కావాలన్నారు. స్వామి వివేకానంద చెప్పిన ‘లే, మేల్కో, గమ్యాన్ని చేరుకునేంతవరకు విశ్రమించకు’ అనే సూక్తిని గుండెలనిండా నింపుకుని భారత్ ను మరోసారి విశ్వగురు చేసే ప్రయత్నంలో ముందుకు నడవాలని ఉపరాష్ర్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ వ్యవస్థాపకుడు నరేశ్, ట్రస్టీ పిడికిటి భూపాల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డితోపాటు వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పాఠశాలలనుంచి వచ్చిన దాదాపు 2,400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.