ఇటీవల  కేంద్రప్రభుత్వం దేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ను నియమించింది. డిసెంబర్ 31(నేటి)నుంచి  ఈ నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రక్షణ బలగాల అధిపతి నియామకం ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ సీడీఎస్గా రావత్ నియామకానికి సోమవారం ఆమోదం తెలిపిందని ఓ అధికారి చెప్పారు. త్రివిధ దళాల్లో కార్గిల్ యుద్ధం సమయంలో  కనిపించిన సమన్వయలోపం నేపథ్యంలో సీడీఎస్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.