ప్రజలు నవ్వుకుంటున్నారు చంద్రబాబు.. ఇక ఆపు!?

Durga Writes

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

                                      

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఎంత సాగదీస్తే భూముల విలువలు అంత పెరుగుతాయనేది చంద్రబాబు నాయుడు స్కెచ్. అందుకే ఐదేళ్లలో నాలుగు తాత్కాలిక భవనాలు మినహా గ్రాఫిక్స్ తోనే కాలం వెళ్లబుచ్చాడు. ఇప్పడు ప్రపంచస్థాయి రాజధానిని తరలిస్తే ఎలా అని పెడబొబ్బలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు'' అంటూ ట్విట్ చేశారు. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ ''ఒకప్పుడు రాష్ట్ర ప్రజల మొత్తం కష్టాన్ని హైదరాబాద్ కు దోచిపెట్టి, తను, తన బంధువులు లాభపడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే ఎత్తుగడతో అమరావతి అని చెప్పి  రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారు. చంద్రబాబు గారి అత్యంత అవినీతికర మైన దోపిడీని ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారి దయ వలన దీనికి చెక్ పడింది.'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: