ఒకసారి మహిళ ఓ వ్యక్తిని ఘాడంగా ప్రేమిస్తే జీవితాంతం అదే వ్యక్తిని మనసులో ఉంచుకుంటుంది. అతనితోనే కలిసి అడుగులు వేస్తుంది. మరో వ్యక్తిని జీవితంలో ఊహించుకోవడానికి ఆసక్తి చూపించదు. ఎన్ని సంవత్సరాలైనా అతనితోనే ఉంటుంది. అతడినే ప్రాణంగా ప్రేమిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అతన్నే దైవంగా భావించి కలిసి ఉంటుంది. మగవాళ్ళు అలా కాదు. పెళ్లికి ముందు వరకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఒకసారి పెళ్లి చేసుకున్నాక... కుటుంబ గొడవల్తోనే జీవితం గడిచిపోతుంది.
కుటుంబం ఆలోచనలతోనే నిండిపోతుంది. కుటుంబం కోసం ఎంతవరకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉంటారు. 20 ఏళ్ళక్రితం ఓ మహిళా.. ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరేమయిందో తెలియదు. సడెన్ గా ఆమె మరో వ్యక్తి ప్రేమలో పడింది. భర్తకు విడాకుల నోటీసులు ఇచ్చింది. భర్త నుంచి విడాకులు రాకండానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.
దీంతో ఆ భర్త షాక్ అయ్యాడు. కోర్టులో కేసు దాఖలు చేశారు. భార్యను నమ్ముకొని ఇంటికి సంబంధించిన లోన్ తీసుకున్నానని, కనీసం విడాకులు కూడా రాకుండానే పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని ఆ భర్త వాదిస్తున్నాడు. హైదరాబాద్ లోని కృష్ణానగర్ కు చెందిన అశోక్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 17 ఏళ్ళు సజావుగానే కాపురం జరిగింది. 17 ఏళ్ల తరువాత మార్పులు వచ్చాయి.
2016 లో ఖమ్మం కు చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. ప్రేమించిన వ్యక్తి కోసం విడాకులు అప్లై చేసింది. కేసు కోర్టులో ఉన్నది. ఇంకా దానికి సంబంధించిన ఎలాంటి తీర్పు రాకుండానే ఆ మహిళ 2017లో ఖమ్మం కు చెందిన వేణుగోపాల్ ను పెళ్లి చేసుకొని ఖమ్మంలో ఉండిపోయింది. దీంతో ఆ భర్త కోర్టును ఆశ్రయించడంతో, వారిపై కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఆ మహిళా, వేణుగోపాల్ కు నోటీసులు జారీ చేశారు.