వల్లభనేని వంశీ ఇప్పుడు పార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న వ్యక్తి. త్వరలోనే ఇతను వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు టార్గెట్గా చేసుకుని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా 2009 ఎన్నికల ప్రచారానికి తాను, కొడాలి నాని ఇద్దరం కలిసి జూనియర్ ఎన్టీఆర్ను ఒప్పించి తీసుకొచ్చామని, కాని ఎన్నికల ఫలితాల తరువాత ఎన్టీఆర్పై చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంతేకాకుండా ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చేసిన చెడు ప్రచారం వల్ల ఆత్మాభిమానం అడ్డొచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటానికి కారణం ఇదేనని తెలిపారు. ఇక 2014 ఎన్నికల్లో ఈయనే పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లారని, ఇదేకాకుండా అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని గుర్తుచేశారు. ఇకపోతే వైసీపీలో ఉన్న కొడాలి నాని. వల్లభనేని వంశీ ఎన్టీఆర్కు సన్నిహితులుగా ఉండగా వల్లభనేనిని మీరు వైసీపీ పార్టీలోకి వెళ్లబోతున్నారు కదా. అంటే త్వరలో ఎన్టీఆర్ను కూడా వైసీలోకి తీసుకెళ్తారా..? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.
ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడని.. అతని భవిష్యత్ను తాను చెప్పలేనంటూ తెలిపారు. అలాగే ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటోన్న ఎన్టీఆర్ ఇప్పటి నుండే టీడీపీ వ్యతిరేకంగా ఉండే మిగిలిన పార్టీల వైపు చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అతడు వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అవన్నీ ఎన్టీఆర్ అంటే గిట్టని వారు చేసిన ప్రచారాలని.. తనకు తెలిసి ఎన్టీఆర్ అలాంటి వాడు కాదని పేర్కొన్నారు.
ఇక ఎన్టీఆర్ గురించి ఈ వెర్షన్ కూడా తాను వినలేదని వల్లభనేని చెప్పుకొచ్చారు. ఇకపోతే చంద్రబాబు నాయుణ్ని కారిడార్ సీఎం అంటూ వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో ఏ ఎమ్మెల్యేతోనైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. అంతే కాకుండా చంద్రబాబు ప్రతిపక్ష నేతగానూ విఫలమయ్యారన్నారని పేర్కొన్నారు..