1. తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుకున్న కారణాలు ఇవేనా?
మహిళలకు రక్షణ రోజు రోజుకు కరువవుతుందని మహిళా తహసీల్దార్ విజయారెడ్డి హత్య తెలియచేస్తుంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. https://bit.ly/34ut0Wq
2. విలీనమా? విరామనా? రేపటి తో ముగియనున్న తెలంగాణ ప్రభుత్వ అల్టిమేటం.
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రేపటి తో నెల రోజులు అవుతుంది. సమ్మె పై ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. తాజా గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగంలో చేరడానికి మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. https://bit.ly/32huOjQ
3. విజయా రెడ్డి సజీవదహనం ... భూవివాదమే కారణమా?
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయా రెడ్డి సజీవ దహన ఘటన కు భూవివాదమే కారణమని తెలుస్తోంది . గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పొలానికి సంబంధించి ఒక రియల్టర్ కు కట్టబెట్టే ప్రయత్నాన్ని విజయారెడ్డి చేశారని నిందుతుడు సురేష్ ఆరోపణలు చేసినట్లు సమాచారం. https://bit.ly/33gSXs2
4. మీడియా సమావేశంలో వైసిపి నేత అంబటి పై పవన్ షాకింగ్ వ్యాఖ్యలు....!!
నిన్న విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల ఆవేదనను ప్రభుత్వానికి తెలిసేలా జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్ పై నేడు అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. https://bit.ly/33f1xrz
5. నితిన్ గడ్కరీ రంగంలోకి దిగాల్సిందె:శివసేన
శివసేన నాయకుడు కిశోర్ తివారీ మహారాష్ట్రలో ఏర్పడ్డ ప్రతిష్ఠంభనపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు లేఖ రాశారు. అంతేకాకుండా సందిగ్ధం తొలిగిపోవాలంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీన,https://bit.ly/2pIIdEv
6. తహశీల్దార్ విజయా రెడ్డి హత్యకు అసలు కారణాలివే...!
తహశీల్దార్ విజయకు దాదాపు ఒంటి గంట సమయంలో నిందితుడు సురేశ్ నిప్పంటించాడని పోలీసులు చెబుతున్నారు. పాస్ బుక్ వివాదం వలన సురేశ్ ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. తహశీల్దార్ కు నిప్పంటించిన సమయంలోనే సురేశ్ కు కూడా మంటలు అంటుకున్నాయని దాడి తరువాత సురేశ్ నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడని తెలుస్తోంది. https://bit.ly/32jU9Kh
7. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించే ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
ఢిల్లీలో సరి—బేసి విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రమాదకరంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సగంపైగా వాహనాలు రోడ్డెక్కవని దీనివల్ల కాలుష్యం తగ్గే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. https://bit.ly/36zfmCW
8. నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావిస్తే......చంద్రబాబుకి వార్నింగ్
ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో మెలగపోతే సహించేది లేదని పార్టీ నాయకులను హెచ్చరించారు. తనకు సన్నిహితుడైన మోహన్ బాబునే సస్పెండ్ చేశానని గుర్తు చేశారు. https://bit.ly/2oJf6jO
9. బెజవాడలో బీజేపీ ఇసుక సత్యాగ్రహం
ఏపీలో ఇసుక కొరత సమస్యపై, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులపై కమలదళం గళమెత్తింది. ఇసుక కొరత కృత్రిమంగా సృష్టించి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వంపై మండిపడింది. నిర్మాణ కార్మికులకు నెలకు 10 వేలు వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. https://bit.ly/2PNakwH
10. విజయారెడ్డి హత్య అమానుషం..అమానవీయం..
దేశంలో మహిళలకు గట్టి భద్రత కల్పిస్తున్నామని ఓ వైపు ప్రభుత్వాలు చెబుతున్నా..మరోవైపు దారుణమైన హత్యలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. https://bit.ly/2pF1Ehs