బీహార్ రాష్ట్రం భోపాల్ లోని హుక్కా లాంజులు లవ్ జిహాద్ ను వ్యాపింపజేసే కేంద్రాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వీటితో సంబంధం ఉందన్న ఆయన.. తన కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భోపాల్ నగరంలో ఉన్న హుక్కా లాంజ్ యజమానులు వెంటనే వాటిని మూసివేయాలని హెచ్చరించారు.