సమాజంలో ఆడవాళ్లకు మాత్రమే భద్రత లేదనుకుంటే అటూ ఇటూ కాని ట్రాన్స్జెండర్స్ను కూడా వదలడం లేదు కామాంధులు.. పాడుపని చేయడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని దారులను జల్లెడపడుతున్నారు కొందరు దరిద్రులు. ఇలాంటివారు అన్నిచోట్ల తిరుగుతూ మానవజాతికే మచ్చలా మారుతున్నారు. ఇకపోతే పాకిస్తాన్లో ఓ ట్రాన్స్జెండర్ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన వెలుగుచూసింది.
ఈ ఘటన సెప్టెంబర్ 20 న కామలి నగరంలోని ధూప్సారి గ్రామంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుంటే సెప్టెంబర్ 20 న కామలి నగరానికి చెందిన నలుగురు ట్రాన్స్జెంటర్లు ఓ ఈవెంట్ కోసం ధూప్సారి గ్రామానికి వెళ్లారట. అక్కడ కార్యక్రమం ముంగించుకుని అర్థరాత్రి 2 గంటలకు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని ఐదుగురు గుర్తుతెలియని దుండగులు అడ్డుకుని, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆ ట్రాన్స్జెండర్లు పై తిరగబడ్డారట.
అంతంటితో ఊరుకోకుండా విచక్షణ కోల్పోయిన దుండగులు ఓ ట్రాన్స్జెండర్ని కిడ్నాప్ చేసి సమీపంలోని ఫామ్హౌజ్కి లాక్కెళ్లి, అనంతరం ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారట. అలా మూడు గంటల పాటు ఆ ట్రాన్స్జెండర్కు నరకం చూపించిన అనంతరం ఆ ట్రాన్స్జెండర్ను సహివాల్ నగరంలో విడిచిపెట్టి పారిపోయారట. పూర్తి నిస్సహాయ స్థితిలో వున్న ఆమె ఓ స్నేహితురాలి సహాయంతో ఇంటికి చేరుకుని, మరుసటి రోజు ఈ ఘటనపై హరప్పా పోలీసులకు ఫిర్యాదు చేశారట. అయితే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న పోలీసులు కేసు మాత్రం నమోదు చేసుకోలేదట. దీంతో ఆమె సహివాల్ డీపీఓకు జరిగిన విషయాన్ని తెలుపగా, డీపీఓ సూచన మేరకు హరప్పా పోలీసులు కేసు నమోదు చేసుకుని, నెల రోజుల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకుని విచారణా చేపట్టారట..