జీవితంలో జీతం సంపాదించాలంటే.. ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం సంపాదిస్తే..ఎంతో కొంత సంపాదన వస్తుంది. అందుకే ఉద్యోగం చేస్తుంటారు. అయితే, కొంతమంది వేరే వేరే మార్గాల్లో డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ చేస్తుంటారు. డబ్బు సంపాదించడానికి అలవాటుపడి తప్పుడు మార్గాల్లో నడుస్తూ జీవితాన్ని తప్పుడు మార్గాల్లో పయనిస్తూ.. డబ్బు సంపాదిస్తుంటారు.
కొంతవరకు బాగానే ఉంటుంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు, అనుమానాలు రానంతకాలం బాగానే ఉంటుంది. కానీ, తప్పుడు మార్గంలో పయనిస్తున్నట్టు తెలిస్తే.. జీవితం అభాసుపాలౌవ్వాల్సి వస్తుంది. కటకటాలు లెక్కపెట్టాల్సి వస్తుంది. దొంగతనం, వ్యభిచారం ఈ రెండు జీవితంలో ఎప్పుడు చేయకూడదు. ఈ రెండు చేస్తే జీవితం వృధా అవుతుంది. దారుణంగా దెబ్బతినాల్సి వస్తుంది.
నిత్యం వార్తల్లో కొన్ని విషయాలు మనం చూస్తుంటాం.. వ్యభిచారం చేస్తూ పట్టుబడినయువతులు .. వ్యభిచార గృహాలపై దాడులు అని చెప్తుంటారు. పోలీసులు నిత్యం రైడ్ చేస్తుంటారు. ఈ రైడ్ లో పట్టుబడుతుంటారు. నెల్లూరులోని బాలాజీ నగర్లోని ఓ అపార్ట్మెంట్ లో దాసరి శాంతమ్మ అనే మహిళా గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఓ అపార్ట్మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తోంది.
గతంలో ఒక్కతే వ్యభిచారం చేసిన శాంతమ్మ.. ఆ తరువాత కొంతమంది యువతులను తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో ఉంచి వ్యభిచారం నిర్వహిస్తోంది. నిత్యం ఆ ఇంటికి ఎవరో ఒకరు వాస్తు పోతుండటంతో.. చుట్టుపక్కల ఉండే వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో పక్కన ఉండే వ్యక్తులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు అదును చూసి ఆ ఇంటిపై రైడ్ చేశారు. ఇద్దరు యువతులు, ఒక విటుడిని పట్టుకున్నారు. వ్యభిచార గృహం నడుపుతున్న దాసరి శాంతమ్మను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. యువతులను ప్రభుత్వ గృహాలకు తరలించారు. ఇక పోలీసుల ఇంటరాగేషన్ లో అనేక విషయాలు బయటపడ్డాయి. యువతులకు నెలజీతాలు ఇస్తూ వ్యభిచారం చేయిస్తోందని యువతులు పేర్కొన్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.