సెలబ్రేటిగా మారిన బిచ్చగత్తే..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలోని రాణాఘట్ రైల్వే స్టేషన్లో బిక్షం ఎత్తుకుని జీవిస్తూ ఉండే రేణు మండల్ అనే యాచకురాలు జీవితం ఇప్పుడు మారి పోయింది.ఎలా అంటే లతా మంగేష్కర్ ఆలపించిన ‘‘ఏక్ ప్యార్ కా నగ్మా హే’’ పాటను తాను రైల్వే స్తేషన్లో తన పొట్టకూటికోసం పాడగా దాన్ని ఎవరో వీడియోతీసి నెట్లో డౌన్లోడ్ చేసారట.ఆ వీడియో వైరల్ అవగా, ఆ పాట అన్ని వుడ్ లు తిరుగుతూ బాలీవుడ్ సెలబ్రేటీల కంట్లో పడిందట..ఆమె అద్భుతమైన గాత్రానికి బాలీవుడ్ ఫిదా అయి పోయింది.అంతేకాకుండా బాలీవుడ్ గాయకుడు,నటుడు హిమేష్ రెష్మియా తన అల్బంలో పాడే అవకాశం కూడా ఇచ్చాడు.ఓ రియాల్టీ షోలో రేణూని కలిసిన హిమేష్..త్వరలో రానున్న నా సినిమా ద్వారా ఆమె పాటను ప్రపంచానికి పరిచయం చేస్తా అంటూ వెల్లడించాడు.
చెప్పినట్లే తన సినిమాలో థేరీ,మేరీ అనే పాటను పాడించారు.ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి,కోట్లాది మంది చూసి ఆమెను అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట.బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం రేణూ మండల్ ను తమ కోసం సినిమాల్లో పాడమని అడుగుతున్నారట.ఈ క్రమంలో ఆమెకు భారీగా రెమ్యూ నేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారట.చూసారా విధి విచిత్రం ఎక్కడ వుండాలో వారిని అక్కడేవుంచి,ఎక్కడ వుండకూడదో వారిని ఆక్కడి నుండి మెళ్లగా జరిపేస్తుంది.కాని దానికి రావలసినసమయం వస్తే ఆగదని ఈ సంఘటనద్వారా రుజువైంది.