పవన్ కల్యాణ్ ఏదో నోటి దురద కొద్దీ మాట్లాడి వెళ్లిపోతే ఊరుకోము...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ఆవేశం తో అప్పుడు నోటికేదొస్తే అది మాట్లాడే వెళ్లి పోయే రకం. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ ఎప్పుడు లైట్ తీసుకుంటుంది. పవన్ ను పెద్దగా పట్టించుకోదు. అయితే ఇప్పడూ మాత్రం వరసగా వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కల్యాణ్ కు క్లాసులు పీకుతున్నారు. వైఎస్ జగన్ ఎక్కడ ఫ్యాక్షన్ ను ప్రోత్సహించాడో చెప్పాలని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పవన్ విమర్శలను వైసీపీ లైట్ తీసుకోవచ్చు.


ఎందుకంటే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి జగన్ మీద ఫ్యాక్షన్ బురద జల్లితే అది అంటుకునేది ఏమీకాదు. అయితే వైసీపీ మాత్రం పవన్ ను లైట్ తీసుకోవడం లేదు. జగన్ వారసత్వం కొద్దీ సీఎం సీటును ఆశిస్తున్నాడు అని పవన్ చెప్పుకురావడాన్ని కూడా వైసీపీ గట్టిగానే నిలదీస్తోంది. మీ అన్న వారసత్వం లేకపోతే నువ్వెవరు? నువ్వా వారసత్వం గురించి మాట్లాడేది? అని వైసీపీ నిగ్గదీస్తోంది.


దీన్నిబట్టి పవన్ కల్యాణ్ ఏదో నోటి దురద కొద్దీ మాట్లాడి వెళ్లిపోతే తాము ఊరికే ఉండమని.. పవన్ ను సహించాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ క్లియర్ కట్ గా స్పష్టం చేస్తోంది. ఇక జనసేన వైపు నుంచి సమాధానాలు ఏవీలేవు. ఆ పార్టీకి ఇది మామూలే. పవన్ ఏదో లాజిక్ లేకుండా, అప్పటికప్పుడు పూనకంలో ఏదో మాట్లాడి వెళ్లిపోతాడు. అవతల వాళ్లు పవన్ కు కౌంటర్లు ఇస్తారు. ఆ తర్వాత జనసేన నుంచి సమాధానాలు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: