సాధారణంగా సినిమాల్లో విలన్లు తమ ప్రత్యర్థులను రౌడిలతో చంపించడానికి రక రకాల పద్దతులు వాడుతుంటారు. అప్పట్లో విలన్ శత్రువులను లారీతో గుద్దించి తన చేతికి మట్టి అంటకుంటా జాగ్రత్త తీసుకుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు హైదరాబాద్ లో ఓ ఎమ్మెల్యే విషయంలో ఇదే తరహాల్ హత్యాప్రయత్నం జరిగింది. హిందూయిజానికి సంబంధించిన ఏ విషయంలోనైనా తన వాయిస్ వినిపించే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై హత్యాయత్నం జరిగిందా... ఆయన్ను లారీతో గుద్దించి హతమార్చే ప్రయత్నం జరిగిందా... అవునంటున్నారు అనుచరులు.
గతంలో ఆయనపై పలు మార్లు హత్యా యత్నాలు జరిగాయని..తాజాగా ఓ సభలో హాజరయ్యేందుకు ఔరంగాబాద్ వెళ్లిన ఎమ్మెల్యే... తిరిగి అనుచరులతో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరారు. హైవే పై వస్తున్న సమయంలో ఓ లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది..కాకపోతే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో... ఆయన సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే అనుచరులు లారీ డ్రైవర్ ని పట్టుకునే ప్రయత్నం చేసేలోపు అతడు పారిపోయాడని తెలిపారు. ప్రస్తుతం క్లీనర్ దొరికాడు..అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాజాసింగ్తో పాటూ అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు లారీ డ్రైవర్ ని వెతికే పనిలో ఉన్నారు. క్లీనర్ నుంచి కొన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.