అమరావతి : పగోళ్ళు మెచ్చుకుంటే ఆ కిక్కే వేరప్పా

Vijaya


రాష్ట్రంలో కొందరికి జగన్మోహన్ రెడ్డి అంటే ఆజన్మ వైరంలాగైపోయింది. జగన్ ఏమి మాట్లాడినా అందులో నెగిటివ్ కోణం మాత్రమే చూసి బురదచల్లేస్తుంటారు. ప్రతిరోజు ఎల్లోమీడియాలో డిబేట్లు జరిగే విధానం చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్ధమైపోతుంది. ఈ డిబేట్లలో పాల్గొనే వాళ్ళలో అత్యధికులు చంద్రబాబునాయుడుకు ఎంతటి సపోర్టుగా ఉంటారో అంతేస్ధాయిలో జగన్ను వ్యక్తిగతంగా ధ్వేషిస్తుంటారు. ఇలాంటి వాళ్ళల్లో కొలికపూడి శ్రీనివాస్, జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ లాంటి కొందరున్నారు.



ఇపుడు వీళ్ళ ప్రస్తావన ఎందుకంటే తెనాలి బహిరంగసభలో జగన్ మాట్లాడుతు ఒక చాలెంజ్ విసిరారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో 175కి 175 సీట్లలో పోటీచేసి గెలిచేంత ధైర్యముందా అని సవాలు విసిరారు. దీనిపై కొలికపూడి, జడ వేర్వేరు ఛానళ్ళల్లో మాట్లాడుతు జగన్ చాలెంజ్ బ్రహ్మాండమన్నట్లుగా చెప్పారు. జగన్ స్పీచ్ వింటుంటే తన రోమాలు నిక్కబొడుకున్నాయి (గూస్ బంప్స్) అని శ్రవణ్ అన్నారు. ఐ ఓపెనర్ గా అనిపించిందన్నారు. ప్రత్యర్ధులకు జగన్ ఇలా చాలెంజ్ విసరటం తనకైతే ఇన్సిపిరేషన్ గా అనిపించిందన్నారు.



ఇదే విషయాన్ని కొలికపూడి వివరిస్తు జగన్ చాలెంజ్ లో ఆత్మవిశ్వాసం కనిపించిందన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ జగన్ ఈ స్ధాయిలో మాట్లాడలేదన్నారు. సీఎం చాలెంజ్ లో  ఆత్మవిశ్వాసం,  మాటల్లో పదును,  సవాలు విసిరేటపుడు బాడీ లాంగ్వేజ్, చాలెంజ్ విసిరిన పద్దతి గతంలో ఎప్పుడూ చూడలేదు, వినలేదన్నారు. వీళ్ళిద్దరు వేర్వేరు ఛానళ్ళల్లో జగన్ గురించి చెబుతున్నపుడు ప్రజెంటర్లు కూడా ఏకీభవిస్తున్నట్లే మౌనంగా చూస్తున్నారు.



వీళ్ళిద్దరు ఎల్లోచానళ్ళల్లో జగన్ స్పీచుపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా అయితే ‘పచ్చోడు పొగిడితే ఆ కిక్కే వేరప్పా’ అనే ట్యాగ్ లైన్ తగిలించి మరీ వైరల్ చేస్తోంది. ఏదేమైనా జగన్ పూర్తిగా ఎలక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోయినట్లు ఇద్దరు అభిప్రాయపడ్డారు. మరి జగన్ చాలెంజ్ ను చంద్రబాబు, పవన్ స్వీకరిస్తారా ? కనీసం జగన్ చెప్పినస్ధాయిలో సమాధానమైనా ఇస్తారా అనేది ఇపుడు ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: