అమరావతి : జగన్ దెబ్బకు టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya



తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి వర్క్ షాపు నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే మంత్రులు, ఎంఎల్ఏల్లో కనీసం 30 మందికి ఫుల్లుగా క్లాసు పీకారు.  కారణం ఏమిటంటే గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం జరిగిన విధానాన్ని సమీక్షంచారు.  ఇప్పటికే ఇలాంటి వర్క్ షాపులు మూడు నిర్వహించి కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనటంలేదనే విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయటంపైనే ఎంఎల్ఏలకు టికెట్లిస్తానని జగన్ లింకుపెట్టారు.



కార్యక్రమంలో సక్రమంగా పాల్గొనని వాళ్ళకి సమావేశంలోనే వార్నింగులిచ్చారు. ఏ కారణం చేతనైనా టికెట్లు దక్కని వాళ్ళు తనను తప్పుపట్టి లాభంలేదని కూడా ఇదివరకే చెప్పేశారు. ఎంఎల్ఏల గ్రాఫ్ సరిగా లేకపోతే టికెట్లిచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. పార్టీ ఫస్ట్ లీడర్ నెక్స్ట్ అనే కాన్సెప్టుతోనే తాను పాలన చేస్తున్నట్లు జగన్ చాలాసార్లు ప్రకటించారు. పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని లేకపోతే ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సొస్తుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తనకొచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఇపుడు కొందరికి తలంటు పోశారు. ఇక్కడే వీళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది.



గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్ఏలు పాల్గొంటున్న విధానంపై రెగ్యులర్ గా ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. ఇంటెలిజెన్స్, పార్టీ వర్గాలు, కోఆర్డినేటర్లు, ప్రభుత్వ యంత్రాంగంతోనే కాకుండా ఐప్యాక్ బృందం ద్వారా కూడా ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. వివిధ మార్గాల్లో వచ్చిన సమాచారాన్ని సమ్ అప్ చేయటం ద్వారా మంత్రులు, ఎంఎల్ఏల భాగస్వామ్యంపై అంచనాకు వచ్చారు.



వర్క్ షాపులో నివేదికలను చదివి అందరి జాతకాలను బయటపెట్టారు.  ఈ వర్క్ షాపులో టికెట్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనే విషయం డైరెక్టుగా ప్రకటించలేదు. కానీ జగన్ చేసిన  కామెంట్ల ఆధారంగా, చెప్పిన  మాటల్లో ఎవరికి వాళ్ళకు తమ భవిష్యత్తు అర్ధమైపోయింది. దీంతోనే రాబోయే రోజుల్లో వైసీపీలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. టికెట్లు దక్కవని అనుకున్న సిట్టింగులు ప్రత్యామ్నాయంగా వేరేపార్టీలను చూసుకుంటారనే టాక్ పెరిగిపోతోంది. అలాంటి వాళ్ళు ఎంతమంది అన్నది మెల్లిగా బయటకు వస్తుంది.  మొత్తానికి వర్క్ షాప్ అందరిలోను టెన్షన్ పెంచేస్తోందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: