రాయలసీమ : లోకేష్ పై హత్యాయత్నమా ? పెద్ద ప్లానేనా ?
ఎలాగైనా పాదయాత్రను ఆపించాలన్న ఆలోచనతోనే హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని సీనియర్ తమ్ముళ్ళు బోండా ఉమ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర ఆరోపించారు. హత్యాయత్నానికి ఆధారాలు ఏమిటయ్యా అంటే మాట్లాడుతుంటే చేతిలో నుండి మైకు తీసేసుకోవటం, సభలను అడ్డుకోవటమట. అంటే మైకు తీసుకుంటేనే, సభలను అడ్డుకుంటేనే హత్యాయత్నానికి కుట్ర పన్నేసినట్లేనా ? అంటే తమ్ముళ్ళు అవుననే చెబుతున్నారు.
ఇంతకన్నా పరాకాష్ట ఏముంటుంది ? లోకేష్ పాదయాత్ర ఎంత దివ్యంగా సాగుతోందో అందరు చూస్తున్నదే. ఎక్కడికక్కడ పాదయాత్ర ఫెయిలని తమ్ముళ్ళే ప్రచారం చేస్తున్నారు. పాదయాత్రలో లోకేష్ వెంట నడుస్తున్న జనాలను చూస్తేనే ఎవరికైనా అర్ధమైపోతుంది పాదయాత్ర విఫలమైందన్న విషయం. మాట్లాడటం చేతకాక, మాట్లాడుతున్నది అర్ధంకాక, చాలాచోట్ల జనాలు లేక, బహిరంగసభల్లో జనాలు కనబడక ఏమిచేయాలో చంద్రబాబునాయుడు, లోకేష్ కి దిక్కుతోచటంలేదు.
పాదయాత్రను కంటిన్యు చేస్తే ఒక అవమానం. నిలిపేస్తే మరో అవమానం. ఏం చేయాలో వీళ్ళకు అర్ధంకావటంలేదు. పాదయాత్రకు జనాలు రావటంలేదనే కదా లోకల్ నేతలు బయటప్రాంతాల నుండి వందలాది కార్లు పెట్టి జనాలను తీసుకొస్తున్నట్లు అచ్చెన్నాయుడుతో చెప్పింది. దిష్టితీసేందుకు గుమ్మడికాయలు, హారతులివ్వటానికి అన్నింటికీ టోకున జనాలను మాట్లాడేసుకున్నామనే ఆడియో టేపు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు. పాదయాత్రను నిలిపేసేందుకు గౌరవప్రదమైన మార్గం గురించి ఆలోచిస్తున్నారు. వాస్తవం ఇలాగుంటే లోకేష్ పై ఎవరు హత్యాయత్నం చేస్తారు ? ఎందుకని చేస్తారు ? మొత్తానికి టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అనే పేరును సార్ధకం చేసుకుంటున్నది.