ఎల్ఐసీలో నెలకు రూ.10 వేలును ఇచ్చే పొదుపు పథకం ఇదే..

Satvika
ప్రభుత్వ స్కీమ్ లలో ఎల్ఐసీ లో ఎన్నో పథకాలు ఉన్నాయి..అందులో ఎన్నో బెస్ట్ స్కీమ్ లు కూడా ఉన్నాయి.. ఆదాయాన్ని ఇస్తున్నాయి.. రిటైర్‌మెంట్ తర్వాత మంచి ఆదయాన్ని పొందేందుకు న్యూ జీవన్‌ శాంతి పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీవితాంతం పెన్షన్‌ను పెందొచ్చు. ఇంతకీ ఈ స్కీ్‌మ్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి. నెలకు ఎంత పొందొచ్చు..ఈ పథకం పూర్తి వివరాలు మీకోసం..

ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ శాంతి పథకంలో రెండు రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. మొదటిది ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్ రెండోది డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇంటర్మీడియట్ యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రీమియం చెల్లించిన తర్వాతే పెన్షన్ సౌకర్యం పొందుతారు. కానీ డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్‌లో పాలసీలో మాత్రం 1, 5, 10, 12 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కనీసం రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడికి పరిమితి అంటూ ఏం లేదు. ప్లాన్‌లో చేరడానికి కనీస వయసు 30, గరిష్ట వయసు 79 ఏళ్లు ఉండాలి.

పాలసీని తీసుకున్న తర్వాత కూడా సరెండర్ చేయొచ్చు. పాలసీపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. జీవన్ శాంతి ప్లాన్‌లో సింగిల్, జాయింట్ పాలసీని ఎంపి చేసుకోవచ్చు. ఒక వేళ పాలసీదారు మరణిస్తే డిపాజిట్ మొత్తం నామినీకి ఇస్తారు. ఇక ఉమ్మడి పాలసీలో పాలసీదారుడు మరణిస్తే పెన్షన్‌ ప్రయోజనం రెండో వ్యక్తికి అందిస్తారు. ఒకవేళ ఇద్దరూ చనిపోతే డిపాజిట్ చేసిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు.ఒక వ్యక్తి ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ శాంతి పాలసీలో సింగిల్ లైఫ్ ప్లాన్ కోసం 45 సంవత్సరాల వయస్సులో డిఫర్డ్ యాన్యుటీలో 12 సంవత్సరాల వ్యవధికి రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే..అతను ప్రతీ ఏటా రూ. 1,20,700 పొందుతారు. అంటే నెలకు రూ. 9,656 పెన్షన్‌ను పొందుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: