పోస్టాఫీసులో మరికొన్ని సదుపాయాలు..ఆ సేవలు పూర్తిగా ఉచితం..

Satvika
చిన్నా, పెద్దా పొదుపు పథకాలను అందిస్తున్న ప్రభుత్వ సంస్థ.. పోస్టాఫీసు లో ఖాతా ఉంటే అనేక ఉచిత సౌకర్యాలు లభిస్తాయి. బ్యాంకు లాగే పోస్టాఫీసులో కూడా సేవింగ్స్ ఖాతా ను తెరవవచ్చు. అలాగే ఏటీఎం, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి అనేక సౌకర్యాలను పొందుతారు. పోస్టాఫీసు లో పొదుపు ఖాతాను తెరిచి ఉంటే ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని సహాయంతో లావాదేవీలు చేయవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా లో ఏటీఎం దరఖాస్తు చేయడానికి ముందుగా ఫారమ్ నింపాలి. ఏటీఎం మాత్రమే కాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్, SMS, మొబైల్ బ్యాంకింగ్ సేవలని కూడా అభ్యర్థించవచ్చు. అయితే ఫారమ్‌ తో పాటు పాస్‌బుక్‌ను జతచేయవలసి ఉంటుంది. మీ సొంత బ్రాంచ్‌లో పోస్ట్ మాస్టర్ అన్ని తనిఖీల ను చేసి ఏటీఎం జారీ చేస్తారు. తర్వాత ATM కార్డ్, పాస్‌బుక్ రెండింటినీ తీసుకోవచ్చు.

ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసిన ఏటీఎం కార్డ్‌ తో ప్రతిరోజూ గరిష్టంగా 25,000 రూపాయల వరకు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఒక లావాదేవీ కి రూ. 10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే డబ్బుల ను డ్రా చేసినప్పుడు ఎటువంటి ఎక్సట్రా చార్జీలను చెల్లించాల్సి అవసరం లేదు.. మెట్రో నగరాల్లో 3 ఉచిత లావా దేవీలు, నాన్-మెట్రో నగరా ల్లో 5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. మరొక బ్యాంకు ఏటీఎం లో ఉచిత లావాదేవీ పరిమితి కి మించి నగదు ను విత్‌డ్రా చేస్తే రూ. 20 + GST ఛార్జ్ చెల్లించాలి. ఇండియా పోస్ట్ వినియోగదారులకు అన్ని పోస్టాఫీసు ఏటీఎంల నుంచి ఉచిత లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది... దీని వల్ల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: