"యనమల ఫ్యామిలీకి శుభం కార్డు" వేయనున్న చంద్రబాబు ?
ఇంతకు ముందు ఏ నియోజకవర్గాల్లో ఎవరిని పోటీ చేయిస్తే విజయం దక్కుతుందన్న విషయంపైన కూడా సర్వే చేయించుకున్నాడట. సర్వే ప్రకారం... తుని నియోజకవర్గంలో గతం వరకూ కూడా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడిని బరిలోకి దింపుతూ వస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం గెలుపును దక్కించుకోలేకపోతోంది. గత రెండు ఎన్నికలలో వైసీపీ తరపు నుండి దాడిశెట్టి రాజా ఎమ్మెల్యే గా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉంటూ తునిలో అంతకంతకూ తన బలాన్ని పెంచుకుంటున్నాడు. ఇక చంద్రబాబు పదే పదే యనమలను తుని లో పోటీ చేయమని చెబుతున్నా ఆయన ఎమ్మెల్యే గా విజయం సాధించాలన్న విషయాన్ని పక్కన పెట్టి రాజ్యసభకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు.
ఇక యనమల కుటుంబంతో రాజకీయ పరంగా పార్టీకి ఏమీ ఉపయోగం ఉందని భావించిన చంద్రబాబు వారిని పూర్తిగా పక్కన పెట్టేయడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇతని స్థానంలో మాజీ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలంగా యాక్టీవ్ గా ఉన్న రాజా అశోక్ బాబుకు సీటును కేటాయించడానికి ప్లాన్ చేస్తున్నారట. తునిలో క్షత్రియ సామజిక వర్గం ఎక్కువగా ఉండడంతో క్షత్రియుడనే ఎన్నుకోనున్నారని టాక్.