ఏపీ ప్రజలకు అలర్ట్..ఆ జిల్లాలకు వానలే వానలు..

Satvika
గత కొన్ని రోజులుగా ఏపీ మొత్తం భారీ వర్షాల కు జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా జల మయంలో వున్నాయి.. అది పూర్తిగా మర్చిపొలెదు. అప్పుడే మరో వాయిగుండం.. గండంలా మారింది.. ఏరోజు ఎలా వుంటుందో జనాలు భయంతో వణికిపోతున్నారు.. ఇప్పుడు అధికారులు మరో హెచ్చరికను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల ను మళ్లీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో సముద్రం పై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం లో అల్పపీడనం గా ఏర్పడనుంద ని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

ఈ అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 18 నాటికి దక్షిణ బంగాళాఖాతం లో వాయు గుండంగా మారుతుందని మంగళవారం ఓ నివేదిక లో పేర్కొంది. ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్ప పీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంద్ర, రాయల సీమ ప్రాంతాల్లో మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ ని అంచనా వేస్తున్నారు.

అలాగే వాయుగుండంగా మారిన తర్వాత తీరం వెంబడి 45 కి. మీ మేరకు ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రం లో వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా చలి తీవ్రత పెరగనుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాబోయే మూడు లేదా నాలుగు రోజులు ఉదయం వేళలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల లో ఉంటాయని.. కొన్ని ప్రదేశా ల్లో పొగమంచు తో కూడిన తేమ వాతావరణ చూడొచ్చునని పేర్కొన్నారు.17, 18, 19 తేదీల్లో విజయవాడ, గోదావరి, రాయల సీమ ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా ఉంటుందని అధికారులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: