ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఏం చెయ్యాలో తెలుసా?
అయితే ఏటీఎంల నుంచి చిరిగిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలను రూపొందించింది. ఈ నియమం ప్రకారం.. చిరిగిన నోట్లు బ్యాంకు ఏటీఎం నుండి వచ్చినట్లయితే ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరించదు. నోట్ల మార్పిడి ప్రక్రియ చాలా సులభం. జూలై 2016లో ఆర్బీఐ అటువంటి నోట్లను మార్చడానికి సర్క్యులర్ కూడా జారీ చేసింది. బ్యాంకు నోట్లను మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది.. ఈ విషయం పై గతంలో చర్చలు కూడా జరిగాయి.
ఏటీఎంకు సంబందించిన బ్యాంక్ నోట్ల మార్పిడి పై అభ్యంతరం తెలిపితే 10 వేలు జరిమానా కూడా వెయ్యొచ్చు.చిరిగిన నోట్లు వస్తున్నాయంటే ఆ బాధ్యత బ్యాంకుపైనే ఉంటుంది. అలాంటి నోట్లను మార్చుకునే బాధ్యత బ్యాంకుదే. అందుకే ఏటీఎంలోనే నోట్లను డిపాజిట్ చేసేటప్పుడు వాటిని సరిచూసుకోవడం బ్యాంకు పని.నోటు సీరియల్ నంబర్, మహాత్మా గాంధీ వాటర్మార్క్, గవర్నర్ సంతకం వంటివి కనిపించకపోతే అది నకిలీ నోటు అని గుర్తించి నోటును మార్చుకోవాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. వాటి విలువ రూ.5000 మించకూడదు. నోట్స్ మార్చుకోవడానికి సదరు వ్యక్తి ఒక అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. మీరు తేదీ, సమయంతో పాటు ఏటీఎం నుంచి విత్డ్రా చేసిన మొత్తం వివరాలను అందులో నమోదు చేయాలి. అలాగే ఏ నోటు చిరిగిపోయిందో, ఏటీఎం స్లిప్ను జత చేయాల్సి ఉంటుంది..అప్పుడే మీకు బ్యాంకు కొత్త నోటును ఇస్తుంది...