మునుగోడులో ఆ ఓటర్లే గెలుపుకు కీలకం?
ఇక ఈ రోజు నుండి ఫలితాల తేలే వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు టెన్షన్ లో ఉంటారు. కాగా పోటీలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్ మరియు బీజేపీ ల మధ్యనే ఉండనుంది. కాగా ఈ ఎన్నికలో ఏ పార్టీ గెలుపు సాధించాలన్నా ఈ ఓటర్లు కీలకం కానున్నారు అని ఒక వార్త వైరల్ అవుతోంది. గెలుపును నిర్ణయించేది ఒక్క ఓటు అయినా చాలా ముఖ్యం అని తెలిసిందే. ఈ విషయం చాలా సార్లు రుజువయింది కూడా ? కాబట్టి ఎన్నికల సంఘం కానీ, అభ్యర్థులు కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా వారిని ప్రేరేపించాలి.
కాగా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఓటు హక్కును కొత్తగా తెచ్చుకున్న వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. ఇక్కడ మొత్తం 2 లక్షల 41 వేల మందికి ఓటు హక్కు ఉండగా, ఇందులో సగం ఓట్లు యువ ఓటర్లు ఉన్నారట. అందుకే అన్ని పార్టీలు యువకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారట. మునుగోడు 39 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళు కరుణిస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది. మరి వీరి మద్దతు ఏ పార్టీకి దక్కుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు వరకు ఆగాల్సిందే.