దళితుల కోసం కెసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం..!!

Satvika
తెలంగాణ సర్కార్ ప్రజల కోసం ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది.వాటి వల్ల ఎంతోమంది లబ్ది పొందారు..ఇకపోతే ప్రభుత్వం దళితుల కోసం మరో గుడ్ న్యూస్ ను అందించింది. దళిత బంధు పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. ఈ పథకం కు సంబందించిన వివరాలను తాజాగా అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.. దళిత బంధు కోసం రూ.600 కోట్లను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరి కీ ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

తెలంగాణ వ్యాప్థంగావివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం నూటికి నూరుశాతం విజయవంతంగా కొనసాగుతోంది.

ముందుగా ఈ పథకం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉపఎన్నిక వేళ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గం లో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామం లో ఉన్న 75 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేశారు. ఆ తర్వాత చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌ మండలాలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆయా మండలాల్లో ని దళిత కుటుంబాలన్నింటికీ సాయం అందించాలని నిర్ణయించి ఆ మేరకు అర్హులను ఎంపిక చేశారు.. ఈ రుణం వారికి ఆర్థిక సాయంగా ఉంటుంది.. అవసరాలకు పనికి వస్తుంది అని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: