"మునుగోడు" లో ఓటుకు రూ. 30 వేలు ?
కానీ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుండి ఈ ఉప ఎన్నికకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వస్తుందని అంచనా. అయినా కానీ... పార్టీల జోరు మాత్రం మాములుగా లేదు. దాదాపుగా ఈ ఎన్నికలో పాల్గొనే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. ముఖ్యంగా ఈ ఎన్నిక మాత్రం కాంగ్రెస్ మరియు బీజేపీ లకు గౌరవ ప్రతిష్ట అని చెప్పాలి. అందుకోసం ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలను రచించుకుంటున్నారు.
కాగా ఇక్కడ ఒక విషయం బాగా వైరల్ గా మారుతోంది. ప్రధానంగా అధికార పార్టీ తెరాస తో కలిపి మూడు పార్టీలు బరిలో ఉండే అవకాశం ఉంది. కాగా ఒక్కో పార్టీ ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే మూడు పార్టీల నుండి ఒక్కో ఓటరు కు ముప్పై వేల రూపాయలు వస్తాయన్న మాట. మరి మూడు పార్టీల నుండి అమౌంట్ తీసుకున్నా ఓటు ఎవరికీ వేస్తారు అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.