"మంగళవారం సీఎం జగన్ కుంభకోణం" లోకేష్ రివీల్ చేస్తాడా ?

VAMSI
గత రెండు వారాల నుండి ఏపీలో రాజకీయ పరిస్థితులు బాగా వేడెక్కాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ రెండు విషయాలు మాత్రం ప్రధానంగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి... ఏపీ లోని అన్ని రాజకీయ పార్టీలు 2024 ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలని ఎవరికి వారు ప్రణాళికలు రచించుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలను విమర్శించడం, చేయని తప్పులకు నిందించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా మరొక విషయం ఏమిటంటే, ఏపీ వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ది అని ప్రచారంలో ఉన్న న్యూడ్ వీడియో పై ప్రతిపక్షాలు ఏ విధంగా చెలరేగి అతనిపై మాట్లాడుతున్నారో తెలిసిందే. దీనికి కౌంటర్ గా వైసీపీ నుండి కూడా కొందరు నాయకులు మాట్లాడుతున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత మూడు రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అన్నది చూశాము. సాధారణంగా నాయకుల మధ్యన కొన్ని మాటలు మారుతూ ఉంటాయి. కానీ లోకేష్ మాట్లాడిన మాటలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. లోకేష్ మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాక ఏపీకి వచ్చిన పరిశ్రమల కంటే కూడా, తరలిపోయిన పరిశ్రమల సంఖ్య చాలా ఎక్కువని చమత్కరించారు. ఇంతటితో ఆగారా అంటే... అదీ లేదు. జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అతి పెద్ద కుంభకోణాన్ని వారంలోపు బయట పెడతాను అని అనడం సంచలనానికి దారి తీసింది.
ఈ వ్యాఖ్య తర్వాత రాష్ట్రం అంతటా హాట్ టాపిక్ అయింది. లోకేష్ ఇంత మాట అన్నాడు ఏంటి...ఇంతకీ ఆ కుంభకోణం ఏమై ఉంటుంది అంటూ ఆశ్చర్యకరంగా టీడీపీ నాయకులు మరియు ప్రజలు తలలు పీక్కుంటున్నారు.  మరి కొందరు అయితే ఇది అంతా లోకేష్ తెలిసో తెలియకో మాట్లాడాడు, అక్కడ అంత సీన్ ఏమీ ఉండదు అంటూ కూరలో కరివేపాకులాగా తీసిపారేస్తున్నారు. ఇక వైసీపీ ఎలాగు ఈ విషయాన్ని పట్టించుకోలేదు... ఇంకొన్ని వర్గాల ప్రజలు నిజంగా కుంభకోణం ఏమైనా ఉందా ? దానికి సంబంధించిన వివరాలు నిజంగానే లోకేష్ వచ్చే వారం బయటపెడతాడా అంటూ ఒత్తిడిలో ఉన్నారు. మరి ఆ కుంభకోణం ఏమిటో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: