చనిపోయేవరకు జగన్ తోనే ప్రయాణం: మాజీ మంత్రి కొడాలి నాని

VAMSI
ఏపీలో వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. మిశ్రమ స్పందనతో జగన్ తన పాలనను కొనసాగిస్తున్నాడు. ప్రతిపక్ష టీడీపీ నిరంతరాయంగా జగన్ పాలనకు ఏదో ఒక విధంగా అడ్డు తగులుతూనే ఉంది. అయితే ప్రతిపక్ష నాయకుల కామెంట్స్ కు సీఎం జగన్ స్పందించకపోయినా... పార్టీ తరపున ఎవరో ఒకరు వారికి తగిన సమాధానం ఇస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నిన్న ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతి పక్ష పార్టీని మరియు టీడీపీ నేత నారా లోకేష్ ను చెడుగుడు ఆడుకున్నారు .
ఈ మీడియా సమావేశంలో భాగంగా విలేకరులు అడిగిన చాలా ప్రశ్నలకు కొడాలి నాని సమాధానం ఇచ్చారు. అయితే ఈ మాటలలో భాగంగా కొడాలి నానిని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా... నేను బ్రతికి ఉన్నంత కాలం నా రాజకీయ ప్రయాణమే జగన్ మోహన్ రెడ్డి తోనే ఉంటుందని ఖరాఖండీగా చెప్పాడు. అంతే కాకుండా నేను పదవి కోసమో లేదా రాజకీయ లబ్ది కోసమో జగన్ చెంతకు చేరలేదని... నేను జగన్ ఆశయాలు నచ్చడం మూలంగానే టీడీపీ ని వదిలి వైసీపీ గూటికి చేరాను అంటూ బదులిచ్చాడు.
టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా మళ్ళీ గెలిచేది వైసీపీ అని ఘంటాపధంగా చెప్పాడు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ భవిష్యత్తును కూడా ఈ సందర్భంగా కొడాలి నాని చెప్పడం, కొసమెరుపు ... గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు తెచ్చుకున్న టీడీపీ , వచ్చే ఎన్నికల్లో సింగల్ డిజిట్ కు పడిపోతుందని కామెంట్ చేశాడు. అయితే కొడాలి నాని చెప్పిన విధంగా జగన్ తోనే తన పయనం ఉంటుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: