నారా లోకేష్ పై చంద్రబాబు వేటు ?
కానీ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అవలంభించే తీరు పట్ల సొంత పార్టీలోనే చాలా మంది కినుక వహిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ లో హైలైట్ అవుతున్న విషయం... ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్... ఇది ఈ మధ్య జరిగిన టీడీపీ మీటింగ్ లలో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి తెలిసిన వారంతా కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కొన్ని జిల్లాలలో కుటుంబంలో రెండు నుండి మూడు సీట్లు వరకు ఆశించే వారే ఉండడం గమనార్హం. అలా చూసుకుంటే కర్నూల్ లో కే ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ లో కొడుకుకి మరియు తమ్ముడుతో కలిపి 3 టికెట్లు కావాలి. ఇక అదే కర్నూల్ లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కి ఒక టికెట్ మరియు ఆయన భార్య కోట్ల సుజాత కు మరో టికెట్... ఇక నంద్యాల లో చూసుకుంటే భూమా అఖిల ప్రియ మరియు ఆయన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి రెండు టికెట్ లు ఇవ్వాల్సి వస్తుంది.
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు బాబు పావులు కదుపుతున్నారు. ఈ పద్ధతి పాటించాలంటే ముందుగా తన ఇంటి నుండే స్టార్ట్ చెయ్యాలి. నారా వారి ఇంటి నుండి చంద్రబాబు కు మాత్రమే టికెట్ తీసుకుని... లోకేష్ కు ఆపెయ్యాలి. అప్పుడే మిగిలిన నాయకులు సైతం ఈ విధానాన్ని అర్ధం చేసుకుంటారు. అలా కాకుండా వీరికి మాత్రం రెండు టికెట్లు తీసుకుని.. మిగతా అందరికీ ఒకే టికెట్ అంటే అర్ధం చేసుకునే పరిస్థితి పార్టీలో లేదు. ఇది చంద్రబాబుకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధానాన్ని ఏ విధంగా అవలంభిస్తాడో చూడాలి.