కిమ్ అంటే ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. ఎందుకంటే ఆయన ఏం చేసినా కూడా అది సంచలనమే. ఇక తాజాగా మరో కార్యం చేసి వార్తల్లో నిలిచారు కిమ్జోంగ్ ఉన్.ఇక దేశాధినేతల్లో కిమ్జోంగ్ ఉన్ది ప్రత్యేక స్థానం. ఆయన ఏం చేసినా అది ఉత్తర కొరియా ప్రజల కోసమే అని నమ్మించే నేర్పరి ఆయన. ఆఖరికి ఆయన మిసైల్ ప్రయోగాలు చేసినా కూడా, అది నార్త్ కొరియన్ల కోసమే అంటుంటారు కిమ్. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆసక్తికి అసలు అంతులేదు. కొన్నిసార్లు అతని గురించి రకరకాల వార్తలు అనేవి ముందుకు రావడం అనేవి ఊహాగానాలు చేయడం. కానీ ఆ దేశంలో ప్రభుత్వ నియంత్రణ అనేది చాలా ఉంది. ఏ వార్తలోనూ నిజమెంతో ధృవీకరించడం కూడా సాధ్యం కాదు. ఈ సమయంలో అతని సోదరి కిమ్ యో జోంగ్ కిమ్ గురించి వివరాలను కూడా అందించింది. కిమ్ జాంగ్ ఉన్ ‘తీవ్ర జ్వరం’తో బాధపడుతున్నారని ఆమె తెలిపింది. ఉత్తర కొరియాలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున కిమ్ జ్వరం అతని కుటుంబంలో మళ్లీ పెద్ద ఆందోళన కలిగించింది.
కరోనా వైరస్ వ్యాప్తికి దక్షిణ కొరియానే కారణమని కిమ్ సోదరి మరోసారి ఆరోపించింది.ఇంకా అలాగే బెలూన్ ద్వారా దక్షిణ కొరియా సరిహద్దులో ‘డర్టీ మ్యాటర్’ పంపడం ద్వారా ఉత్తర కొరియాకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందని కిమ్ యో జోంగ్ చెప్పినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం నాడు నివేదించింది. దీనికి ముందు, ఈ ఉత్తర కొరియా పాలకుడి భౌతిక స్థితిపై అధికారికంగా ఎటువంటి కామెంట్స్ చేయలేదు.ఇక కిమ్ సోదరి, యు జోంగ్ మాట్లాడుతూ.. కిమ్ జ్వరం బారిన పడ్డారని..అతనికి “తీవ్రమైన అనారోగ్యం” అని వెల్లడించింది. ‘దేశ పౌరుల గురించి ఆందోళన చెందుతున్నందున కిమ్ ఒక్క క్షణం కూడా పడుకుని విశ్రాంతి తీసుకోలేరని’ అని ఆమె తెలిపింది.అయితే, కిమ్ ఎప్పుటి నుంచి అనారోగ్యంతో ఉన్నారో తన సోదరి యో జోంగ్ వెల్లడించలేదు.