తెలంగాణ వర్షాలు: నిండా మునిగిన రైతులు!

Purushottham Vinay
తెలంగాణలో వర్షం బీభత్సమ్ సృష్టిస్తుంది.ఇక ఈ నెలలో అయితే అసలు ఒక వారం పాటు ఆగకుండా పడిన వానకు రంగారెడ్డి ఇంకా వికారాబాద్జిల్లాల్లోని రైతులు భారీగా నష్టపోగా, సోమవారం నాడు అర్ధరాత్రి నుంచి మంగళవారం  నాడు రాత్రి 12 గంటల వరకు కురిసిన భారీ వర్షం అయితే అసలు నిండా ముంచింది.చాలా చోట్ల కూడా పంటలు కొట్టుకుపోయాయి. ఇంకా మొక్క దశలో ఉన్నవి పూర్తిగా కుళ్లిపోయాయి. పొలాలు అనేవి కోతకు గురయ్యాయి. నవాబ్పేట, ధారూర్, పూడూరు, పెద్దేముల్, కోటపల్లి, మోమిన్ పేట ఇంకా తాండూరు, యాలాల మండలాల్లో అధిక పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. ధారూర్ మండల పరిధిలోని మైలారం, నాగారం, మోమిన్ ఖుర్దు ఇంకా మోమిన్ కలాన్ గ్రామాల్లో నష్టపోయిన రైతులు ఎకరానికి రూ.20వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కౌలు రైతులు అయితే లబోదిబోమంటున్నారు. అప్పు తెచ్చి పంటలు వేశామని, ఈ వర్షం తీవ్ర నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు భారీ వర్షాలతో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


ఇక ఈ నెల మొదటి వారంలో కురిసిన వానకు జరిగిన పంట నష్టాన్ని తేల్చామని, తాజా వర్షాలకు సంబంధించి ఇప్పుడే సర్వే చేసే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు.టమోటా, మిర్చి, క్యాలీఫ్లవర్, పత్తి, మొక్కజొన్న ఇంకా వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు. వరుస వానలతో చిరువ్యాపారులు కూడా చాలా నష్టపోతున్నారు. బుధవారం నాడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రేగడిదోస్వాడ, చేవెళ్ల మండలం ఘనాపూర్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంకా ఎమ్మెల్యే కాలె యాదయ్య పర్యటించారు. దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. ఈసీ ఇంకా మూసీ నదుల పరివాహక ప్రాంతాల్లోని నష్టాన్ని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.ఈ పంటల నష్టంపై వికారాబాద్జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ను వివరణ కోరగా.. వర్షం నీరు పొలాల నుంచి వెళ్లిపోయాక కొన్ని పంటలు కోలుకుంటాయని, ఆ తర్వాతే నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు. నీట మునిగిన,ఇంకా కొట్టుకుపోయిన పంటల వివరాలు తమ వద్ద లేవని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: