ప్లీనరీ విందు భోజనం.. వింటేనే నోరూరుతుంది..
ప్లీనరీ మెనూ..
సీఎం వైఎస్ జగన్ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరు కాబోతున్న ఈ ప్లీనరీలో భోజనం మెనూ అదిరిపోతోంది. అతిథులకోసం 25 రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. తొలిరోజు ప్లీనరీకోసం వచ్చే రెండున్నర లక్షలమంది కోసం ఈ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. వంట రెడీ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికీ ఆ రుచి అందేలా.. ప్లీనరీ ప్రాంగణంలో భోజనం వడ్డించేందుకు 250 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ విందు భోజనం సందడి మొదలవుతుంది. రెండున్నర లక్షలమందికి వడ్డించడం అంటే మాటలా. 250 కౌంటర్లు పెట్టుకున్నా కూడా అది కాస్త కష్టసాధ్యమే. అందుకే.. మధ్యాహ్నం 11 గంటలనుంచే భోజనాలు మొదలవుతాయి. 3 గంటల వరకు కొనసాగుతాయి. అతిథుల సంఖ్యను బట్టి ఆ తర్వాత కూడా భోజనాలు అందరికీ వడ్డిస్తారు. మెనూ విషయానికి వస్తే.. ఇందులో 25 రకాల వంటలు ఉన్నాయి. వెజ్, నాన్వెజ్ లో రకరకాల వెరైటీలు ఇక్కడ చేస్తున్నారు. మటన్ థమ్ బిర్యాని, చికెన్ రోస్ట్, రొయ్యల కూర, బొమ్మిడాయిల పులుసు, చేపల పులుసు, ఉడికించిన కోడిగుడ్లు, వెజ్ బిర్యానీ, ఆవకాయ.. ఇలా మొత్తం 25 వెరైటీలు అందుబాటులో ఉంటాయని వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.