మనిషి ముక్కులోకి దూరిన రొయ్య.. చివరికి?
అయితే ఇటీవలే రొయ్యల చెరువు లోకి దిగిన ఒక వ్యక్తికి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా రొయ్యలు మనిషి శరీరంపై పాకుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా రొయ్యల చెరువు లోకి దిగిన ఒక వ్యక్తి ముక్కులోకి రొయ్య దూరింది. దీంతో ఆ వ్యక్తి విలవిలలాడి పోయాడు అని చెప్పాలి. ఈ ఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా గణపవరం మండలం లో వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఏపీలో ఎక్కువగా రొయ్యల చెరువు సాగు చేస్తూ ఉంటారు ఎంతోమంది. ఎక్కడ చూసినా ఇలాంటి రొయ్యల చెరువులు చేపల చెరువులు కనిపిస్తూ ఉంటాయి.
కాగా ఇటీవలే ఏలూరు జిల్లా గణపవరం మండలం లోని ఓ వ్యక్తి రొయ్యల చెరువులో దిగగా రొయ్య ముక్కు లోకి దూరింది. అదే సమయంలో రొయ్యల మీసం ముక్కులోపల గుచ్చుకోవడం తో ఇక రొయ్య అందులోనే ఇరుక్కుపోయింది. ఎంతకీ బయటకి రాలేదు. దీంతో సదరు వ్యక్తి అల్లాడిపోయాడు. అయితే సదరు వ్యక్తిని భీమవరం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఎండోస్కోపీ తో రొయ్యను డాక్టర్లు బయటకు తీశారు. ఇలా బయటకు తీసే సమయానికి కూడా రొయ్య బ్రతికె ఉండడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.