పాచినోటితో ముద్దుకు ఒప్పుకోలేదని భార్యను హత్యచేసిన భర్త!

Purushottham Vinay
ఇక కలకాలం తోడుగా ఉంటానని మాటిచ్చిన భార్యకు భర్త ఆమె పాలిట కిరాతకుడిగా మారాడు.అతను పళ్లు తోముకోకుండా కొడుకుని ముద్దు పెట్టుకోవడాన్ని అడ్డుకుందని జీవితభాగస్వామిని దారుణంగా హతమార్చాడు.ఇక కేరళ(Kerala) పాలక్కాడ్ జిల్లాలోని మన్నార్క్కాడ్ కరక్కురిస్సీలో మంగళవారం నాడు ఈ విషాదం అనేది చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే పాలక్కాడ్(Palakkad) జిల్లాలోని మన్నార్క్కాడ్ కరక్కురిస్సీలో నివాసముంటున్న 30 ఏళ్ల అవినాష్- దీపిక(28)కి 2019 వ సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే అవినాష్ కు ఇది రెండో వివాహం. అతడి మెదటి భార్య ఒడిషా రాష్ట్రానికి చెందినది కాగా కుటుంబకలహాల నేపథ్యంలో ఆమెకు విడాకులిచ్చి 2019 వ సంవత్సరంలో తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన దీపికను పెళ్లి చేసుకున్నాడు.వృత్తి పరంగా అవినాశ్ ఎయిర్ఫోర్స్ సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలో సహాయ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇక అవినాష్-దీపిక దంపతులకు ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. అయితే అవినాష్ మంగళవారం నాడు ఉదయం నిద్ర లేవగానే తన కుమారుడిని ముద్దాడేందుకు అతను ప్రయత్నించాడు.అయితే భర్త పళ్లు తోముకోకపోవడంతో అతని భార్య దీపిక దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.దీంతో దంపతుల మధ్య కూడా మాటల యుద్ధం ప్రారంభమైంది.


ఇక కోపంతో అవినాష్ వారి కొడుకు ముందే దీపికపై కొడవలితో దాడి చేశాడు. ఆమె మెడ, కాళ్లు ఇంకా చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విన్న ఇరుగుపొరుగు ఉదయం పూట 9 గంటల సమయంలో అవినాష్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న దీపిక పక్క ఆమె కుమారుడు ఐవిన్‌ ఏడుస్తూ ఆమెను కౌగిలించుకుని ఉండటం వారికి కనిపించింది. అలాగే దీపిక పక్కనే కొడవలి పట్టుకుని నిలబడిన అవినాష్‌ను కూడా స్థానికులు చూశారు. దీపికను 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వారు తరలించారు. అయితే, పాపం కొద్దిసేపటికే ఆమె తీవ్ర గాయాలతో మరణించింది.ఇక దీపిక స్వస్థలం కోయంబత్తూరు. అవినాష్ బెంగళూరులో తన ఉద్యోగం చేస్తున్నాడు. ఇక కొన్నాళ్లుగా బెంగళూరులో ఉంటున్న దంపతులు రెండు నెలల క్రితం మన్నార్‌క్కాడ్‌కు వెళ్లారు.ఇక అక్కడి స్థానికులు అవినాష్‌ను పోలీసులకు అప్పగించారు. అవినాష్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: