పెళ్లైన ఐదు రోజులకే అల్లుడిని నరికి చంపిన మామ!

Purushottham Vinay
ఇక పెళ్లైన ఐదు రోజులకే తన కుమార్తెను వేధించిన అల్లున్ని ఓ మామ నరికి చంపేశాడు. వివరాల్లోకి కనుక వెళ్లినట్లయితే తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తిరుత్తురై పూండి శింగాలం గ్రామానికి చెందిన చిట్టరసన్‌ కుమారుడు ముత్తరసన్‌(23) వీరాపురానికి చెందిన రవిచంద్రన్‌ కుమార్తె అరవిందతో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.ఇక గతంలో అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమై ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన ముత్తరసన్‌ అరవిందపై అప్పుడు కత్తితో దాడి కూడా చేశాడు. ఈ పరిణామాలతో ఆ వివాహం అనేది దెబ్బకు ఆగింది. అరవిందను దక్కించుకునేందుకు ముత్తరసన్‌ చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఐదు రోజుల క్రితం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో అరవిందను అతను వివాహం చేసుకున్నాడు.శుక్రవారం నాడు ఉదయం పూట తన భార్యతో కలిసి మామ రవిచంద్రన్‌ ఇంటికి ముత్తరసన్‌ వచ్చాడు. ఇక సాయంత్రం పూట బయటకు వెళ్లిన ముత్తరసన్‌ రాత్రి సమయంలో బాగా ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతని మామపై తనకు వివాహ సమయంలో ఇచ్చిన బంగారం చైన్ ఇంకా అలాగే ఉంగరం విసిరేశాడు.


అక్కడికి వచ్చిన భార్య అరవిందపై కూడా తన ప్రతాపం చూపించాడు. తాను కట్టిన తాళిబొట్టు ఇచ్చేయాలంటూ కూడా అతను బాగా వేధించాడు. దీంతో కోపోద్రిక్తుడైన రవిచంద్రన్‌ ఇంట్లో ఉన్న కొడవలితో దెబ్బకు అల్లుడు ముత్తరసన్‌ను నరికేశాడు. రక్తగాయాలతో సంఘటనా స్థలంలోనే అతని అల్లుడు అక్కడికక్కడే మరణించాడు. ఇక ఆ అర్ధరాత్రి వేళ సమాచారం అందుకున్న తిరుత్తురై పూండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాగా విచారించారు. ఇక ఆ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తన కళ్లెదుటై కుమార్తెను అలా నానా రకాలుగా వేధించడంతో హతమార్చినట్టు రవిచంద్రన్‌ అంగీకరించి పోలీసుల వద్ద అతను లొంగి పోయాడు.ఇలా కూతురిని వేధిస్తున్న అల్లుడిని మామ అడ్డంగా నరికి చంపాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: