ఆ మంత్రికి పవన్ ఫుల్ స్టాప్ పెట్టగలడా?

Purushottham Vinay
ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఊహించని విధంగానే జరుగుతాయి.ఎప్పుడు ఎవరు ఎలా తిట్టుకుంటారో అసలు అర్ధం కాదు.ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేసుకుంటారో అసలు తెలియదు.అసలు రాజకీయం అనేది ఎలా ఉంటుందంటే అధికార వైసీపీ ఏదైనా మంచి పనిచేసినా సరే ఇక దాన్ని కూడా ఏదొక రకంగా విమర్శించడం ప్రతిపక్ష టీడీపీ పనిగా ఉంది.ఇంకా అలాగే వైసీపీ కూడా తాము చేస్తున్న తప్పులు తెలుసుకోకుండా టీడీపీని తిట్టడం బాగా అలవాటు అయిపోయింది.అలాగే వైసీపీలో చంద్రబాబు నాయుడుని తిట్టడానికి కొందరు ప్రత్యేకంగా ఉంటారు.ఇంకా అలాగే పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి కొందరు ఉంటారు.ఇక ముఖ్యంగా మంత్రులు విషయానికొస్తే…గతంలో పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇంకా అలాగే కన్నబాబు లాంటి వారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడేవారు.ఇప్పుడు సీన్ అంతా మారింది.గుడివాడ అమర్నాథ్ ఇంకా రోజా లాంటి వారు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా అమర్నాథ్ అయితే పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలే చేస్తున్నారు. ఆ మధ్య కూడా పవన్ కళ్యాణ్ తో అమర్నాథ్ దిగిన ఫోటోని జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశాయి.


ఇక దానికి కౌంటర్ గా పవన్ కల్యాణే తనతో ఫోటో దిగారని చెప్పి అమర్నాథ్ అప్పుడు చెప్పుకొచ్చారు.కానీ అక్కడ వాస్తవం వచ్చి అమర్నాథ్ పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగారు.కానీ అమర్నాథ్ కావాలని ఇక్కడ సెటైర్ వేశారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ పొత్తు విషయంలో మూడు ఆప్షన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీనిపై కూడా అమర్నాథ్ సెటైర్ వేశారు.పవన్ కళ్యాణ్ కు కూడా ఏదైనా మూడు ఉండాలసిందే అంటూ మాట్లాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో కూడా అందరికీ తెలిసిందే.ఇలా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్న అమర్నాథ్ కు చెక్ పెట్టాలని జనసేన చూస్తుంది. ఇంకా వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ ని ఎలాగైనా అనకాపల్లి బరిలో ఓడించాలని అనుకుంటుంది. అయితే జనసేన పార్టీకి సింగిల్ గా ఓడించే సత్తా లేదని చెప్పొచ్చు.కానీ టీడీపీతో కలిస్తే మాత్రం అనకాపల్లిలో అమర్నాథ్ కు ఖచ్చితంగా చెక్ పడిపోతుంది.ఇక గత ఎన్నికల్లో టీడీపీపై అమర్నాథ్ 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే జనసేన పార్టీకి 12 వేల ఓట్లు వచ్చాయి.అంటే టీడీపీ ఇంకా జనసేన కలిస్తే అనకాపల్లిలో అమర్నాథ్ పరిస్తితి ఏం అవుతుందో అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: