ఇక వారిద్దరూ కూడా గతంలో ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలం వారికి మనస్పర్థలు వచ్చాయి. దీంతో బ్రేకప్ చెప్పుకుని వారు విడిపోయారు. అయితే అనూహ్యంగా కొంతకాలం తర్వాత అతడి నుంచి ఆమెకు మళ్లీ మెసేజ్ వచ్చింది.ఇక ప్రియుడు మారిపోయి..ఆమెతో మళ్లీ కలిసి ప్రయాణించాలనుకుంటున్నాడేమో అని ఆమె అనుకుంది. ఇంకేముంది.. గతంలో లాగానే చాటింగ్ చేసింది. అతనితో మనసు విప్పి మాట్లాడింది. ఇక గతంలో ఉన్న పరిచయం నేపథ్యంలో… అతను కోరడంతో ఆమె సెమీ న్యూడ్ ఫోటోలు పంపించింది. ఈ క్రమంలో ఓసారి కలుద్దామని అతడు ఆమెను రిక్వెస్ట్ చేశాడు. దాంతో ఆమె ఓకే అంది. ఓరోజు ఇద్దరూ స్ట్రైయిట్ కలుసుకోగా ఇక అతను మాజీ ప్రియుడు కాదని తెలుసుకొని ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆపై ఆ కేటుగాడి నుంచి ఆమెకు బ్లాక్మెయిలింగ్ అనేది ప్రారంభమైంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని శివరాంపల్లికి చెందిన మహమ్మద్ మొహ్సిన్(22) అనే వ్యక్తి పెయింటర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఓ మహిళకు మెసేజ్ చేసి ఆమెకు రాజుగా పరిచయం చేసుకున్నాడు. ఆమె అతడిని తన మాజీ ప్రియుడిగా అనుకుంది. అతనూ కూడా అలాగే యాక్టింగ్ చేశాడు.
ఇద్దరూ కూడా రోజు గంటల కొద్దీ ఊసులు చెప్పుకున్నారు. అలాగే కాస్త హద్దులు మీరి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే అతని కోరిక మేరకు అర్ధనగ్న ఫోటోలను పంపించింది.ఆ తరువాత ఓ రోజు ఇద్దరూ కలుసుకోగా.. ఆ యువకుడు తన మాజీ బాయ్ఫ్రెండ్ కాదని తెలిసి ఆమె స్టన్ అయ్యింది. వెంటనే తన ప్రైవేట్ ఫోటోలు డిలీట్ చేయాలని అతడిని కోరింది. అతను డబ్బులిస్తేనే ఆ పని చేస్తానని ఆమెకు చెప్పాడు. లేకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బాగా బెదిరించాడు. దీంతో బాగా ఆలోచించిన ఆమె వెంటనే షీ టీమ్కు కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు మొహ్సిన్ను అదుపులోకి తీసుకుని విచారించగా తప్పు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. తదుపరి చర్యల కోసం మలక్పేట పోలీసులకు అతన్ని అప్పగించారు. అతనిపై సెక్షన్385, 354 ఐసీసీ ఇంకా 67ఏ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. రిమాండ్కు తరలించారు.