జగ్గారెడ్డి ఫైర్‌: నేను మొగోడినా.. మీరు మొగోళ్లా?

Chakravarthi Kalyan
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మరోసారి టీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి సమైక్యవాదిని టీఆర్ఎస్‌ నేతల విమర్శలపై ఆయన స్పందించారు. మీ టీఆరెస్ పార్టీలో ఉన్న సమైక్యవాదులు కనిపించడం లేదా అని ప్రశ్నించిన తూర్పు జగ్గారెడ్డి.. నేను అప్పుడు ఇప్పుడు సమైక్యవాదినే అన్నారు. నేను డైరెక్ట్ గానే మాట్లాడుతున్న ఓపెన్ గా ఉంటా..టీఆరెస్ పార్టీ ని  సూటిగా అడుగుతున్న కేసీఆర్ ని బట్టలు ఇప్పి కొడుతానన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ టీఆరెస్ ప్రభుత్వ క్యాబినెట్ లో  మంత్రే కదా.. అని ప్రశ్నించారు. ఉద్యమంలో కేసీఆర్ ఊరికించి కొడుతానన్న ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పుడు మీ ప్రభుత్వ క్యాబినెట్ లొనే ఉన్నాడు కదా.. అని గుర్తు చేశారు.

మంత్రి పువ్వడా అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నికర్సైనా  స్వమైక్య వాదులే కదా.. ఉద్యమ సమయంలో టీఆరెస్  కార్యకర్తలను ఊరికించి కొట్టిన దానం నాగేందర్ ఇప్పుడు టీఆరెస్ లొనే ఉన్నాడు కదా.. మీ టీఆరెస్ పార్టీ లో,ప్రభుత్వంలో ఉన్న సమైక్యవాదులు కనిపించడం లేదా.. దీనికి టీఆరెస్ పార్టీ ఎలాంటి జవాబు చెబుతుంది..దీని సమాధానం ఉందా..? అని  తూర్పు జగ్గారెడ్డి నిలదీశారు.

సినిమా డైలాగ్ లు మాట్లాడడం కాదు...నువ్వు మాట్లాడిన మాటలను మేము సీరియస్ గానే తీసుకుంటున్నాం.. నేను డైరెక్ట్ గా సమైక్యవాదిని , మీరు ఇండైరెక్టు గా సమైక్యవాదులే కదా నేను చెప్పిన అంశాల ప్రకారం..  టీఆరెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఇండైరెక్టు గా  సమైక్య వాదులే కదా..!  నేను మొగోడినా..? మీరు మొగోళ్లా అని నిలదీశారు  తూర్పు జగ్గారెడ్డి.

రాష్ట్రం వచ్చినాకా తెలంగాణ లోని కాంట్రాక్ట్ లని తెలంగాణ కాంట్రాక్టర్లే చేస్తారని కలలుకన్నారు..!కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఇంకా మీ పరిపాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్ లే కదా పని చేస్తోంది.. * ఇది మీకు సిగ్గు అనిపించడం లేదా..  మరొక్కసారి మాట్లాడితే మీ  మొత్తం చరిత్ర చెప్తా... నిన్ను వంద మాటలు అని   వేస్ట్ అనుకోని  నా గడ్డంలో ఒక వెంట్రుకతో పోల్చినా..మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఓయూ నాయకులు నీ సంగతి చూసుకుంటారని  తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: