డేంజర్: రానున్న 5 రోజులు ఎక్కువ ఎండలు !
వాతావరణ నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ వివరించింది. దాంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ఈ మండే ఎండలను తట్టుకోలేకపోతున్నారు. ఇక తప్పనిసరి పనుల కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండలు మండిపోతుండటంతో చాలా మంది ప్రజలు తమ తమ పనులను ఉదయం లేదా సాయంత్రం చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనాలు పెద్దగా బయటకు రావడం లేదు. వాయువ్య భారతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ను కూడా తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్న నేపథ్యం లో ప్రజలు అప్రమత్తం అయి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా చిన్నారులు, వృద్దల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అంటున్నారు. అదే కాకుండా మే నెల మొదటి వారం లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ముందుగా అప్రమత్తం అయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.