పవన్‌కు భయపడుతున్న తమ్ముళ్ళు?

M N Amaleswara rao
అవును నిజమే పవన్ కల్యాణ్‌కు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు..ఆయన తాజాగా పొత్తుకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే...ఆయనతో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభాలు కంటే నష్టాలు కూడా ఎక్కువే ఉన్నాయని తమ్ముళ్ళు భావిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలని బట్టి చూస్తే టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి..సరే కలిసి పోటీ చేస్తే లాభం అయితే లేకపోలేదు...రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి చెక్ పెట్టొచ్చు...ఓట్లు చీలిపోకుండా చాలా నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించవచ్చు.

అయితే ఇక్కడ జనసేనకు పూర్తి లాభం ఉండగా, టీడీపీకి కాస్త లాభం, కాస్త నష్టం జరిగేలా ఉంది...అందులో మొదటిగా కొన్ని సీట్లని టీడీపీ వదులుకోవాలి..రాష్ట్రంలో 175 స్థానాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది..కానీ జనసేనకు ఆ బలం లేదు. ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు ఇవ్వాలి..అలా జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తికి గురయ్యే ఛాన్స్ ఉంది..అలాగే తర్వాత అక్కడ టీడీపీకి నాయకత్వ లోపం రావొచ్చు.
పైగా జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసేలా ఉంది..అదే చేస్తే టీడీపీకి ఇంకా ఎక్కువ బొక్క. సరే ఎలాగోలా సర్దుకుపోయి సీట్లు ఇస్తే...నెక్స్ట్ గెలిచి అధికారంలోకి వచ్చాక పవన్, జనసేన నేతలతో వేరే రకమైన టార్చర్ ఉంటుందని, తమ వల్లే అధికారంలోకి వచ్చారని మాట్లాడతారని, గతంలో వారు మాట్లాడిన మాటలు అందరికీ తెలుసని అంటున్నారు. మరొకసారి అలాగే మాట్లాడే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు.
ఇక్కడ పొత్తు వల్ల వైసీపీకి నష్టం ఎలా ఉంటుందో..కాస్త లాభం కూడా ఉంటుందని చెబుతున్నారు..ఎందుకంటే ఎవరు పొత్తు పెట్టుకున్న సరే జగన్ సింగిల్ గానే పోటీ చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు...అంటే ఒక్కడిని ఓడించడం కోసం అందరూ ఏకమవుతున్నారనే సింపతీ కోణాన్ని పైకి తీసుకొస్తున్నారు. ఈ సింపతీ గాని హైలైట్ అయితే వైసీపీకే లాభం అవుతుందని, అలా కాకుండా వైసీపీ ప్రభుత్వం తప్పులని దృష్టిలో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఏదేమైనా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి... సింగిల్ గానే పోటీ చేద్దామని పలువురు తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు..పవన్‌ కల్యాణ్‌తో పొత్తు వద్దు అన్నట్లే మాట్లాడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: